BGMI : దేశవ్యాప్తంగా ఉన్న పబ్జి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. ఈ గేమ్ను తొలగించాలని కేంద్ర ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆండ్రాయిడ్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి ఈ గేమ్ను తొలగించారు. 2020 సెప్టెంబర్ 2వ తేదీన కేంద్రం పలు చైనీస్ యాప్లను నిషేధించింది. వాటిల్లో పబ్జి కూడా ఒకటి. అయితే దీనికి పేరు మార్చి ఎలాంటి చైనా సంస్థ సహాయం లేకుండానే గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ మళ్లీ ఈ గేమ్ను మన దేశంలో లాంచ్ చేసింది.
అలా పబ్జి కాస్తా బ్యాటిగ్ గ్రాండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) పేరిట 2021 జూలై 2వ తేదీన ఈ గేమ్ను భారత్లో మళ్లీ లాంచ్ చేశారు. అయితే ఇటీవలే ఈ గేమ్కు గాను ఏడాది పూర్తయింది. కానీ కొందరు ఇచ్చిన పిటిషన్ కారణంగా గేమ్ను తొలగించాలని కేంద్రం గూగుల్, యాపిల్లకు నోటీసులు జారీ చేసింది. దీంతో గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ నుంచి.. యాపిల్ సంస్థ యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ను తొలగించాయి. అయితే గేమ్పై పూర్తి స్థాయిలో ఇంకా నిషేధం విధించలేదు. ఇది పాక్షిక నిషేధమే. కనుక ఇప్పటికే ఈ గేమ్ ఇన్స్టాల్ అయి ఉన్నవారు దీన్ని ఆడడం కొనసాగించవచ్చు. కానీ ఇకపై కొత్తగా ఇన్స్టాల్ చేయలేరు. పూర్తి స్థాయి విచారణ తరువాతే ఈ గేమ్ ను కొనసాగించాలా.. వద్దా.. అని నిర్ణయం తీసుకోనున్నారు. అందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బీజీఎంఐ గేమ్ను 3 కారణాల వల్ల నిషేధించారని తెలుస్తోంది. పబ్జి గేమ్కే పేరుమార్చి ఈ గేమ్ను రిలీజ్ చేశారని.. కానీ చైనాతో లింకులు అలాగే కొనసాగిస్తున్నారని ప్రధాన ఆరోపణ. అలాగే ఈ గేమ్ వల్ల పిల్లలు, యువత ప్రభావానికి లోనై కుటుంబ సభ్యులను హత్య చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఓ బాలుడు పబ్జి కారణంగా తన తల్లిని చంపేశాడు. ఇక ఈ గేమ్ వల్ల బెట్టింగ్లు పెట్టడం, తల్లిదండ్రులకు తెలియకుండా వారి అకౌంట్లలోని డబ్బులను పిల్లలు దొంగిలించి దాంతో గేమ్లో ఐటమ్స్ను కొనడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూడు కారణాల వల్లే బీజీఎంఐ గేమ్ను నిషేధించారని తెలుస్తోంది. అయితే ఈ గేమ్ భవితవ్యం ఏమిటనేది.. త్వరలోనే తేలనుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…