BGMI : దేశవ్యాప్తంగా ఉన్న పబ్జి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. ఈ గేమ్ను తొలగించాలని కేంద్ర ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆండ్రాయిడ్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి ఈ గేమ్ను తొలగించారు. 2020 సెప్టెంబర్ 2వ తేదీన కేంద్రం పలు చైనీస్ యాప్లను నిషేధించింది. వాటిల్లో పబ్జి కూడా ఒకటి. అయితే దీనికి పేరు మార్చి ఎలాంటి చైనా సంస్థ సహాయం లేకుండానే గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ మళ్లీ ఈ గేమ్ను మన దేశంలో లాంచ్ చేసింది.
అలా పబ్జి కాస్తా బ్యాటిగ్ గ్రాండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) పేరిట 2021 జూలై 2వ తేదీన ఈ గేమ్ను భారత్లో మళ్లీ లాంచ్ చేశారు. అయితే ఇటీవలే ఈ గేమ్కు గాను ఏడాది పూర్తయింది. కానీ కొందరు ఇచ్చిన పిటిషన్ కారణంగా గేమ్ను తొలగించాలని కేంద్రం గూగుల్, యాపిల్లకు నోటీసులు జారీ చేసింది. దీంతో గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ నుంచి.. యాపిల్ సంస్థ యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ను తొలగించాయి. అయితే గేమ్పై పూర్తి స్థాయిలో ఇంకా నిషేధం విధించలేదు. ఇది పాక్షిక నిషేధమే. కనుక ఇప్పటికే ఈ గేమ్ ఇన్స్టాల్ అయి ఉన్నవారు దీన్ని ఆడడం కొనసాగించవచ్చు. కానీ ఇకపై కొత్తగా ఇన్స్టాల్ చేయలేరు. పూర్తి స్థాయి విచారణ తరువాతే ఈ గేమ్ ను కొనసాగించాలా.. వద్దా.. అని నిర్ణయం తీసుకోనున్నారు. అందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బీజీఎంఐ గేమ్ను 3 కారణాల వల్ల నిషేధించారని తెలుస్తోంది. పబ్జి గేమ్కే పేరుమార్చి ఈ గేమ్ను రిలీజ్ చేశారని.. కానీ చైనాతో లింకులు అలాగే కొనసాగిస్తున్నారని ప్రధాన ఆరోపణ. అలాగే ఈ గేమ్ వల్ల పిల్లలు, యువత ప్రభావానికి లోనై కుటుంబ సభ్యులను హత్య చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఓ బాలుడు పబ్జి కారణంగా తన తల్లిని చంపేశాడు. ఇక ఈ గేమ్ వల్ల బెట్టింగ్లు పెట్టడం, తల్లిదండ్రులకు తెలియకుండా వారి అకౌంట్లలోని డబ్బులను పిల్లలు దొంగిలించి దాంతో గేమ్లో ఐటమ్స్ను కొనడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూడు కారణాల వల్లే బీజీఎంఐ గేమ్ను నిషేధించారని తెలుస్తోంది. అయితే ఈ గేమ్ భవితవ్యం ఏమిటనేది.. త్వరలోనే తేలనుంది.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…