BGMI : దేశవ్యాప్తంగా ఉన్న పబ్జి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. ఈ గేమ్ను తొలగించాలని కేంద్ర ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆండ్రాయిడ్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి ఈ గేమ్ను తొలగించారు. 2020 సెప్టెంబర్ 2వ తేదీన కేంద్రం పలు చైనీస్ యాప్లను నిషేధించింది. వాటిల్లో పబ్జి కూడా ఒకటి. అయితే దీనికి పేరు మార్చి ఎలాంటి చైనా సంస్థ సహాయం లేకుండానే గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ మళ్లీ ఈ గేమ్ను మన దేశంలో లాంచ్ చేసింది.
అలా పబ్జి కాస్తా బ్యాటిగ్ గ్రాండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) పేరిట 2021 జూలై 2వ తేదీన ఈ గేమ్ను భారత్లో మళ్లీ లాంచ్ చేశారు. అయితే ఇటీవలే ఈ గేమ్కు గాను ఏడాది పూర్తయింది. కానీ కొందరు ఇచ్చిన పిటిషన్ కారణంగా గేమ్ను తొలగించాలని కేంద్రం గూగుల్, యాపిల్లకు నోటీసులు జారీ చేసింది. దీంతో గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ నుంచి.. యాపిల్ సంస్థ యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ను తొలగించాయి. అయితే గేమ్పై పూర్తి స్థాయిలో ఇంకా నిషేధం విధించలేదు. ఇది పాక్షిక నిషేధమే. కనుక ఇప్పటికే ఈ గేమ్ ఇన్స్టాల్ అయి ఉన్నవారు దీన్ని ఆడడం కొనసాగించవచ్చు. కానీ ఇకపై కొత్తగా ఇన్స్టాల్ చేయలేరు. పూర్తి స్థాయి విచారణ తరువాతే ఈ గేమ్ ను కొనసాగించాలా.. వద్దా.. అని నిర్ణయం తీసుకోనున్నారు. అందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బీజీఎంఐ గేమ్ను 3 కారణాల వల్ల నిషేధించారని తెలుస్తోంది. పబ్జి గేమ్కే పేరుమార్చి ఈ గేమ్ను రిలీజ్ చేశారని.. కానీ చైనాతో లింకులు అలాగే కొనసాగిస్తున్నారని ప్రధాన ఆరోపణ. అలాగే ఈ గేమ్ వల్ల పిల్లలు, యువత ప్రభావానికి లోనై కుటుంబ సభ్యులను హత్య చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఓ బాలుడు పబ్జి కారణంగా తన తల్లిని చంపేశాడు. ఇక ఈ గేమ్ వల్ల బెట్టింగ్లు పెట్టడం, తల్లిదండ్రులకు తెలియకుండా వారి అకౌంట్లలోని డబ్బులను పిల్లలు దొంగిలించి దాంతో గేమ్లో ఐటమ్స్ను కొనడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూడు కారణాల వల్లే బీజీఎంఐ గేమ్ను నిషేధించారని తెలుస్తోంది. అయితే ఈ గేమ్ భవితవ్యం ఏమిటనేది.. త్వరలోనే తేలనుంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…