Bandla Ganesh : సినీ నటుడు, బడా నిర్మాత బండ్ల గణేశ్ ఏం చేసినా ఒక సెన్సేషనలే. ప్రతినిత్యం ప్రముఖులను విమర్శిస్తూ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తన మనసులోని మాటను ఏ మాత్రం సంకోచం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు బయటకు చెప్పేస్తుంటారు. ట్విట్టర్ వేదికగా సినీ స్టార్స్ ని విమర్శిస్తూ విరుచుకుపడుతుంటారు. తాజాగా జరిగిన చిత్ర ప్రి-రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు పూరీ జగన్నాథ్ ను టార్గెట్ చేస్తూ విమర్శించిన విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పుడు బండ్ల గణేష్ ఇద్దరు హీరోలను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ ద్వారా చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటినుంచి నేను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ ని. కాదు కాదు పవన్ కళ్యాణ్ భక్తుడిని అంటూ ఆయన చెప్పుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఇద్దరూ హీరోలను విమర్శించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
బండ్ల గణేష్ యువ హీరోలను ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో చాలామంది ప్రముఖుల ముందు అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నారు. అయితే ఈ విషయం గమనించిన బండ్ల గణేష్ ఆ ఫోటోతోపాటు, వేరే ఫంక్షన్ లో వినియంగా కూర్చున్న పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ లో సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర.. దయచేసి నేర్చుకోండి.. ఆచరించండి. ఇది మన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ ను మధ్యలోకి తీసుకొచ్చాడు.
దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోపాటు మిగతా స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఆ మాత్రం మినిమమ్ సెన్స్ ఉండాలిగా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు బండ్లన్న నీకు ఇది అవసరమా.. ప్రతి విషయంలో అన్నయ్యను ఎందుకు లాగుతావు. వేరే విషయం ఏమన్నా ఉంటే చూడు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…