Ban Pak Cricket : నిన్న మొన్నటి వరకు భారత క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ మత్తులో మునిగి తేలారు. ఇక మరికొద్ది రోజుల్లో పొట్టి క్రికెట్ కప్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దుబాయ్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వరల్డ్ కప్లో భాగంగా భారత్ తన మొదటి మ్యాచ్ను ఈ నెల 24వ తేదీన పాకిస్థాన్తో ఆడనుంది. కానీ ఆ దేశంతో మ్యాచ్ ఆడొద్దని అభిమానులు కోరుతున్నారు.
ట్విట్టర్లో #ban_pak_cricket పేరిట భారత అభిమానులు ఓ హ్యాష్ టాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. తాజాగా శ్రీనగర్లో జరుగుతున్న ఉగ్రదాడుల్లో భారత బలగాలు ఎన్ కౌంటర్ చేస్తూ ఉగ్రవాదులను హతమార్చుతున్నాయి. ఈ దాడుల్లో కొందరు సాధారణ పౌరులు, సిబ్బంది చనిపోయారు. అయితే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ తో మ్యాచ్ ఆడొద్దని భారత క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.
పాకిస్థాన్తో మ్యాచ్ ఆడకపోతే కేవలం 2 పాయింట్లు మాత్రమే పోతాయి.. భారత్కు వచ్చే నష్టం ఉండదు. దీంతో ప్రపంచ దేశాలకు పాక్ అసలు రంగు తెలుస్తుంది.. అందువల్ల పాకిస్థాన్తో మ్యాచ్ ఆడొద్దు.. ప్లీజ్.. అంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం.. పాక్తో మ్యాచ్ ఆడి వారిని చిత్తుగా ఓడించాలని.. అప్పుడు వారి పరువు తీసినట్లవుతుందని అంటున్నారు. ఇక కొందరైతే ఏకంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టును బ్యాన్ చేయాలని ఐసీసీని కోరుతున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ రోజు ఏ విధంగా పరిస్థితులు ఉంటాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…