Balakrishna : సినిమా సెలబ్రిటీలు అంటే సహజంగానే అందరికీ ఎంతో కొంత ఆసక్తి ఉంటుంది. వారిని కలవాలని, వారితో ఫొటోలు దిగాలని, వారి ఆటోగ్రాఫ్లు పొందాలని.. కలలు కంటుంటారు. ఇక తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ అయితే ఆ తాపత్రయం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇంత వరకు ఓకే. అయితే ఏ టైమ్లో ఫొటో దిగాలో కూడా తెలిసి ఉండాలి. కానీ కొందరు అసలు మైండ్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. సమయం, సందర్భం చూసుకోకుండా సెల్ఫీలు దిగుతున్నారు. నలుగురిలోనూ అభాసుపాలవుతున్నారు. ఒక వ్యక్తికి ఇలాగే జరిగింది.
నందమూరి బాలకృష్ణ తన సోదరి ఉమా మహేశ్వరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చెల్లెలు పోయిన పుట్టెడు దుఃఖంలో ఆయన ఉన్నారు. బరువెక్కిన హృదయాలతో తీవ్ర మనస్థాపంతో ఆయన పాడె మోశారు. అయితే అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ.. ఒక వ్యక్తి మాత్రం బాలయ్య వద్దకు వచ్చి సెల్పీ అడిగాడు. అయితే ఆ సమయంలో బాలయ్య తీవ్ర విషాదంలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే అతని చెంప చెళ్లుమని ఉండేది.
కాగా అలా అతను సెల్ఫీ కోసం వచ్చిన బాలయ్యను అడిగినప్పుడు బాలయ్య చూసిన చూపుకు చెందిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అందరూ ఆయన చెంపదెబ్బ కొడతారేమోనని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇకనైనా మారాలని.. సమయం, సందర్భం చూసి సెల్ఫీలు అడగాలని.. ఇలా మైండ్ లేకుండా ప్రవర్తించవద్దని నెటిజన్లు హితబోధ చేస్తున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…