Rekha Vedavyas : శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆకాష్ హీరోగా వచ్చిన ఆనందం మూవీ అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ అప్పట్లో యూత్కు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ మూవీ ద్వారా తెలుగు పరిచయం అయిన బ్యూటీ.. రేఖ. ఈమె పూర్తి పేరు రేఖ వేదవ్యాస్. ఈమెది కర్ణాటక. కన్నడలో అనేక సినిమాల్లో ఈమె నటించింది. అప్పట్లో ఈమె అనేక మంది యంగ్ హీరోలతో నటించింది. నందమూరి తారకరత్నతో కలిసి ఒకటో నంబర్ కుర్రాడులో యాక్ట్ చేసింది. అయితే ఈ మూవీ నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ మూవీలోని పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి.
ఇక ఆనందం తరువాత జాబిలి, ఒకటో నంబర్ కుర్రాడు, దొంగోడు, అనగనగా ఓ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి చిత్రాల్లో రేఖ నటించింది. అయితే నాగార్జున మన్మథుడు మూవీలో ఈమె గెస్ట్ రోల్లో నటించింది. ఈ క్రమంలోనే ఆయన ఈమెకు మరో సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారట. కానీ ఆయన నుంచి కాల్ రాలేదు. అసలు ఏమైంది.. అన్న విషయం కూడా తెలియదు. కానీ ఈమె అప్పుడప్పుడు ఈ విషయం చెబుతూ విచారిస్తుంటుంది.
ఇక రేఖ చివరిసారిగా తెలుగులో జీనియస్ అనే చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించగా.. ఈమె చివరి సినిమా పాదమ్ పేసమ్. తమిళంలో వచ్చింది. 2014లో తెరకెక్కించారు. అప్పటి నుంచి ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటోంది. అయితే త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ కన్నడ సీజన్లో ఈమె పాల్గొంటుందని వార్తలు వస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలోనూ ఈమె యాక్టివ్గానే ఉంటోంది. ఈ బ్యూటీకి ఇప్పటికీ ఇంకా పెళ్లి మాత్రం కాలేదు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…