Rekha Vedavyas : శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆకాష్ హీరోగా వచ్చిన ఆనందం మూవీ అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ అప్పట్లో యూత్కు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ మూవీ ద్వారా తెలుగు పరిచయం అయిన బ్యూటీ.. రేఖ. ఈమె పూర్తి పేరు రేఖ వేదవ్యాస్. ఈమెది కర్ణాటక. కన్నడలో అనేక సినిమాల్లో ఈమె నటించింది. అప్పట్లో ఈమె అనేక మంది యంగ్ హీరోలతో నటించింది. నందమూరి తారకరత్నతో కలిసి ఒకటో నంబర్ కుర్రాడులో యాక్ట్ చేసింది. అయితే ఈ మూవీ నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ మూవీలోని పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి.
ఇక ఆనందం తరువాత జాబిలి, ఒకటో నంబర్ కుర్రాడు, దొంగోడు, అనగనగా ఓ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి చిత్రాల్లో రేఖ నటించింది. అయితే నాగార్జున మన్మథుడు మూవీలో ఈమె గెస్ట్ రోల్లో నటించింది. ఈ క్రమంలోనే ఆయన ఈమెకు మరో సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారట. కానీ ఆయన నుంచి కాల్ రాలేదు. అసలు ఏమైంది.. అన్న విషయం కూడా తెలియదు. కానీ ఈమె అప్పుడప్పుడు ఈ విషయం చెబుతూ విచారిస్తుంటుంది.
ఇక రేఖ చివరిసారిగా తెలుగులో జీనియస్ అనే చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించగా.. ఈమె చివరి సినిమా పాదమ్ పేసమ్. తమిళంలో వచ్చింది. 2014లో తెరకెక్కించారు. అప్పటి నుంచి ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటోంది. అయితే త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ కన్నడ సీజన్లో ఈమె పాల్గొంటుందని వార్తలు వస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలోనూ ఈమె యాక్టివ్గానే ఉంటోంది. ఈ బ్యూటీకి ఇప్పటికీ ఇంకా పెళ్లి మాత్రం కాలేదు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…