Balakrishna NTR : తెలుగు తెరపై ఇప్పటికే అనేక హీరోలకు చెందిన కాంబినేషన్లు వచ్చాయి. అప్పట్లో ఇప్పట్లో చాలా మంది కాంబినేషన్లలో నటించారు. మల్టీ స్టారర్ మూవీలు ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉన్నాయి. అయితే ప్రేక్షకులు మాత్రం ఎంతో కాలం నుంచి ఒక కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అది వర్కవుట్ అయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. అయితే వారు ఎలాగూ సినిమా తీయడం లేదు కదా.. కనీసం ఫొటోషాప్ చేసి అయినా తమ సరదా తీర్చుకుందామని ఫ్యాన్స్ అనుకున్నారు. ఇంకేముందీ.. తమ అభిమాన హీరోలకు చెందిన ఫొటోను వారు ఎడిట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. దీంతో ఆ ఫొటో కాస్తా వైరల్గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
నందమూరి వంశంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ లకు ప్రస్తుతం ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ఈ మధ్యే బాలయ్య అఖండతో అలరించగా.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే వీరిద్దరూ విడి విడిగా సినిమాలు చేస్తున్నారు కానీ కలసి మాత్రం ఒక్క మూవీ కూడా చేయలేదు. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారు తమ కల తీరుతుందో.. తీరదో.. అనుకున్నారో.. ఏమో.. తెలియదు కానీ.. ఫొటోషాప్ ద్వారా ఆ సరదాను తీర్చుకున్నారు. ఎన్టీఆర్, బాలయ్యను కలిపి ఒకే ఫ్రేమ్లో చూసుకునేలా ఒక ఫొటోను వారు ఎడిట్ చేశారు.
బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న ఎన్బీకే 107 మూవీలోని ఆయన గెటప్తో ఉన్న ఫొటోను మార్ఫింగ్ చేసి అందులో ఎన్టీఆర్ ముఖాన్ని పెట్టారు. తరువాత బాలయ్య, ఎన్టీఆర్ ఫొటోలను కలిపారు. దీంతో ఇద్దరూ ఒకే ఫ్రేమ్లోకి వచ్చేశారు. ఈ క్రమంలోనే బాలయ్య, ఎన్టీఆర్ లను ఇలా ఒకే ఫ్రేమ్లో చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఫొటోనే ఇలా ఉంటే.. ఇక వీరు నిజంగానే సినిమాను తీస్తే.. అప్పుడు తెరపై వీరిద్దరూ కనిపిస్తే.. అది ఎలా ఉంటుందో.. ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫొటోను చూసి ఫ్యాన్స్ కూడా అలాగే ఫీలవుతున్నారు. ఇక ఈ ఫొటోను వారు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కోరిక మేరకు అయినా సరే భవిష్యత్తులో బాలయ్య, ఎన్టీఆర్లు కలసి సినిమాను చేస్తారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…