Balakrishna NTR : తెలుగు తెరపై ఇప్పటికే అనేక హీరోలకు చెందిన కాంబినేషన్లు వచ్చాయి. అప్పట్లో ఇప్పట్లో చాలా మంది కాంబినేషన్లలో నటించారు. మల్టీ స్టారర్ మూవీలు ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉన్నాయి. అయితే ప్రేక్షకులు మాత్రం ఎంతో కాలం నుంచి ఒక కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అది వర్కవుట్ అయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. అయితే వారు ఎలాగూ సినిమా తీయడం లేదు కదా.. కనీసం ఫొటోషాప్ చేసి అయినా తమ సరదా తీర్చుకుందామని ఫ్యాన్స్ అనుకున్నారు. ఇంకేముందీ.. తమ అభిమాన హీరోలకు చెందిన ఫొటోను వారు ఎడిట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. దీంతో ఆ ఫొటో కాస్తా వైరల్గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
నందమూరి వంశంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ లకు ప్రస్తుతం ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ఈ మధ్యే బాలయ్య అఖండతో అలరించగా.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే వీరిద్దరూ విడి విడిగా సినిమాలు చేస్తున్నారు కానీ కలసి మాత్రం ఒక్క మూవీ కూడా చేయలేదు. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారు తమ కల తీరుతుందో.. తీరదో.. అనుకున్నారో.. ఏమో.. తెలియదు కానీ.. ఫొటోషాప్ ద్వారా ఆ సరదాను తీర్చుకున్నారు. ఎన్టీఆర్, బాలయ్యను కలిపి ఒకే ఫ్రేమ్లో చూసుకునేలా ఒక ఫొటోను వారు ఎడిట్ చేశారు.
బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న ఎన్బీకే 107 మూవీలోని ఆయన గెటప్తో ఉన్న ఫొటోను మార్ఫింగ్ చేసి అందులో ఎన్టీఆర్ ముఖాన్ని పెట్టారు. తరువాత బాలయ్య, ఎన్టీఆర్ ఫొటోలను కలిపారు. దీంతో ఇద్దరూ ఒకే ఫ్రేమ్లోకి వచ్చేశారు. ఈ క్రమంలోనే బాలయ్య, ఎన్టీఆర్ లను ఇలా ఒకే ఫ్రేమ్లో చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఫొటోనే ఇలా ఉంటే.. ఇక వీరు నిజంగానే సినిమాను తీస్తే.. అప్పుడు తెరపై వీరిద్దరూ కనిపిస్తే.. అది ఎలా ఉంటుందో.. ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫొటోను చూసి ఫ్యాన్స్ కూడా అలాగే ఫీలవుతున్నారు. ఇక ఈ ఫొటోను వారు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కోరిక మేరకు అయినా సరే భవిష్యత్తులో బాలయ్య, ఎన్టీఆర్లు కలసి సినిమాను చేస్తారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…