Manchu Vishnu : మంచు ఫ్యామిలీకి చూస్తుంటే బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు అనిపిస్తోంది. టాలీవుడ్ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించారంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణుతోపాటు ఆయన తండ్రి మోహన్బాబును ట్రోల్ చేశారు. తరువాత మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియాపై కూడా దారుణంగా విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా మంచు విష్ణు ఆఫీస్ నుంచి విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ క్రమంలోనే ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
జూబ్లీహిల్స్లోని సీబీఐ కాలనీలో మంచు విష్ణు కార్యాలయం ఉంది. అందులో బోరబండకు చెందిన యు.నాగశ్రీను అనే వ్యక్తి హెయిర్ స్టైలిస్ట్గా పనిచేస్తున్నాడు. అయితే అతను ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. దీంతోపాటు హెయర్ డ్రెస్సింగ్ మేకప్ సామగ్రిని కూడా తీసుకెళ్లాడు. వాటి విలువ రూ.5 లక్షలుగా ఉంటుందని మంచు విష్ణు ఆఫీస్ మేనేజర్ సంజయ్ తెలిపారు. ఈ క్రమంలోనే సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా ఈ నెల 17 నుంచే నాగశ్రీను కనిపించకుండా పోయాడు. అతను ఫోన్లో కూడా అందుబాటులోకి రావడం లేదు. దీంతోనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న ఫిర్యాదు చేసినప్పటికీ ఈ విషయం మాత్రం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నాగశ్రీను కోసం పోలీసులు గాలిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…