Samantha : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా సమంత, నాగచైతన్యలకు ఎంతగానో పేరు ఉండేది. కానీ వీరు విడాకుల నిర్ణయాన్ని ప్రకటించాక ఆ పేరు వీరికి పోయింది. వీరు విడివిడిగా ఉంటున్నప్పటి నుంచే సందేహాలు మొదలయ్యాయి. సమంత తన సోషల్ ఖాతాల్లో అక్కినేని అనే ఇంటి పేరును తొలగించాక ఆ అనుమానాలు బలపడ్డాయి. తరువాత అవే నిజమయ్యాయి. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అయితే విడాకుల నిర్ణయం తరువాత ఆ ఒత్తిడి నుంచి బయట పడేందుకు సమంత తీర్థ యాత్రలు, టూర్లు వెళ్లి వచ్చింది. తరువాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారింది. మరోవైపు నాగచైతన్య కూడా సినిమాలతో బిజీగా మారిపోయాడు. కానీ ఇద్దరిలో సమంత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది.
విడాకుల తరువాత సినిమాల జోరు పెంచిన సమంత తాజాగా హాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నట్లు చెప్పింది. అయితే సమంతకు చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే..
సమంత అప్పట్లో నటుడు సిద్ధార్థతో లవ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారేమోనని అందరూ ఊహించారు. కానీ వారి మధ్య ఏం జరిగిందో తెలియదు, బ్రేకప్ చెప్పుకున్నారు. తరువాత సమంత చైతూను పెళ్లి చేసుకుంది. ఇక ఇటీవల సమంత విడాకుల ప్రకటనపై సిద్ధార్థ్ పరోక్షంగా స్పందించాడు. అతని ట్వీట్ వైరల్ అయింది.
అయితే అప్పట్లో సిద్ధార్థనే పెళ్లి చేసుకోవాలని సమంత బలంగా ఫిక్సయిందట. ఇదే విషయంపై ఇప్పుడు బాగా చర్చ నడుస్తోంది. అప్పట్లో సమంత, సిద్ధార్థ కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని అనుకున్నారట. కానీ అలా జరగలేదు. పెళ్లి పీటల వరకు వచ్చిన విషయం ఎందుకు అక్కడితోనే ముగిసిపోయింది, తరువాత ఎందుకు వారు విడిపోవాల్సి వచ్చింది.. అన్న విషయాలు తెలియవు. కానీ ఆ సంఘటన వల్ల సిద్థార్థ్ చాలా డిస్టర్బ్ అయ్యాడట. ఈ క్రమంలోనే ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…