Samantha : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా సమంత, నాగచైతన్యలకు ఎంతగానో పేరు ఉండేది. కానీ వీరు విడాకుల నిర్ణయాన్ని ప్రకటించాక ఆ పేరు వీరికి పోయింది. వీరు విడివిడిగా ఉంటున్నప్పటి నుంచే సందేహాలు మొదలయ్యాయి. సమంత తన సోషల్ ఖాతాల్లో అక్కినేని అనే ఇంటి పేరును తొలగించాక ఆ అనుమానాలు బలపడ్డాయి. తరువాత అవే నిజమయ్యాయి. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అయితే విడాకుల నిర్ణయం తరువాత ఆ ఒత్తిడి నుంచి బయట పడేందుకు సమంత తీర్థ యాత్రలు, టూర్లు వెళ్లి వచ్చింది. తరువాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారింది. మరోవైపు నాగచైతన్య కూడా సినిమాలతో బిజీగా మారిపోయాడు. కానీ ఇద్దరిలో సమంత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది.
విడాకుల తరువాత సినిమాల జోరు పెంచిన సమంత తాజాగా హాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నట్లు చెప్పింది. అయితే సమంతకు చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే..
సమంత అప్పట్లో నటుడు సిద్ధార్థతో లవ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారేమోనని అందరూ ఊహించారు. కానీ వారి మధ్య ఏం జరిగిందో తెలియదు, బ్రేకప్ చెప్పుకున్నారు. తరువాత సమంత చైతూను పెళ్లి చేసుకుంది. ఇక ఇటీవల సమంత విడాకుల ప్రకటనపై సిద్ధార్థ్ పరోక్షంగా స్పందించాడు. అతని ట్వీట్ వైరల్ అయింది.
అయితే అప్పట్లో సిద్ధార్థనే పెళ్లి చేసుకోవాలని సమంత బలంగా ఫిక్సయిందట. ఇదే విషయంపై ఇప్పుడు బాగా చర్చ నడుస్తోంది. అప్పట్లో సమంత, సిద్ధార్థ కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని అనుకున్నారట. కానీ అలా జరగలేదు. పెళ్లి పీటల వరకు వచ్చిన విషయం ఎందుకు అక్కడితోనే ముగిసిపోయింది, తరువాత ఎందుకు వారు విడిపోవాల్సి వచ్చింది.. అన్న విషయాలు తెలియవు. కానీ ఆ సంఘటన వల్ల సిద్థార్థ్ చాలా డిస్టర్బ్ అయ్యాడట. ఈ క్రమంలోనే ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…