Asia Cup 2022 : దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీ లీగ్ మ్యాచ్లో పసికూన ఆఫ్గనిస్థాన్ జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఆఫ్గన్ బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్మెన్ విలవిలలాడిపోయారు. వికెట్లను వెంట వెంటనే సమర్పించుకున్నారు. దీంతో తక్కువ స్కోరుకే శ్రీలంక ఆలౌట్ అయింది. ఆ లక్ష్యాన్ని ఆఫ్గనిస్థాన్ సునాయాసంగా ఛేదించింది. ఆసియా కప్లో బోణీ కొట్టింది. లంక జట్టుపై 8 వికెట్ల తేడాతో ఆఫ్గనిస్థాన్ గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్గన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా లంక జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో శ్రీలంక 19.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో భానుక రాజపక్స (38 పరుగులు) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఆఫ్గన్ బౌలర్లలో ఫజల్హక్ ఫరూకీ 3 వికెట్లు పడగొట్టగా ముజీబ్ ఉర్ రహమాన్ 2 వికెట్లు తీశాడు. అలాగే మహమ్మద్ నబీకి 2 వికెట్లు, నవీన్ ఉల్ హక్కు 1 వికెట్ దక్కాయి.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ జట్టు 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 106 పరుగులు చేసింది. ఆఫ్గన్ బ్యాట్స్మెన్లలో రహమానుల్లా గుర్బాజ్ 18 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 40 పరుగులు చేయగా.. హజ్రతుల్లా జజై 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 37 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. లంక బౌలర్లలో వనిందు హసరంగ డిసిల్వాకు 1 వికెట్ దక్కింది. కాగా ఈ టోర్నీలో తరువాతి మ్యాచ్ భారత్, పాక్ల మధ్య ఇదే వేదికపై జరగనుంది. ఆదివారం ఆగస్టు 28వ తేదీన రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరుగుతుంది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…