Asia Cup 2022 : దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీ లీగ్ మ్యాచ్లో పసికూన ఆఫ్గనిస్థాన్ జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఆఫ్గన్ బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్మెన్ విలవిలలాడిపోయారు. వికెట్లను వెంట వెంటనే సమర్పించుకున్నారు. దీంతో తక్కువ స్కోరుకే శ్రీలంక ఆలౌట్ అయింది. ఆ లక్ష్యాన్ని ఆఫ్గనిస్థాన్ సునాయాసంగా ఛేదించింది. ఆసియా కప్లో బోణీ కొట్టింది. లంక జట్టుపై 8 వికెట్ల తేడాతో ఆఫ్గనిస్థాన్ గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్గన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా లంక జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో శ్రీలంక 19.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో భానుక రాజపక్స (38 పరుగులు) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఆఫ్గన్ బౌలర్లలో ఫజల్హక్ ఫరూకీ 3 వికెట్లు పడగొట్టగా ముజీబ్ ఉర్ రహమాన్ 2 వికెట్లు తీశాడు. అలాగే మహమ్మద్ నబీకి 2 వికెట్లు, నవీన్ ఉల్ హక్కు 1 వికెట్ దక్కాయి.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ జట్టు 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 106 పరుగులు చేసింది. ఆఫ్గన్ బ్యాట్స్మెన్లలో రహమానుల్లా గుర్బాజ్ 18 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 40 పరుగులు చేయగా.. హజ్రతుల్లా జజై 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 37 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. లంక బౌలర్లలో వనిందు హసరంగ డిసిల్వాకు 1 వికెట్ దక్కింది. కాగా ఈ టోర్నీలో తరువాతి మ్యాచ్ భారత్, పాక్ల మధ్య ఇదే వేదికపై జరగనుంది. ఆదివారం ఆగస్టు 28వ తేదీన రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరుగుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…