Arundhati Movie : సూపర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ముద్దుగుమ్మ అనుష్క. ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. వరుస సూపర్ హిట్ లు అందుకోవడంతో హీరోల రేంజ్ లో అనుష్క క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటికీ అనుష్క కోసం సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారంటే ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ ప్రారంభంలో కేవలం హీరోల పక్కన సినిమాలు చేసిన అనుష్క ఆ తరవాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ అదరగొట్టింది.
అనుష్క లీడ్ రోల్ చేసిన అరుంధతి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో అనుష్క నటనకు అంతా ఫిదా అయ్యారు. ఈ చిత్రాన్ని శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. కోడి రామకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు తెర వెనుక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ నడిచింది. ఓ పార్టీలో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి బంధువు పదే పదే గద్వాల్ కోట గురించి మాట్లాడుతండగా ఆయనకు ఆసక్తికరంగా అనిపించిందట.
అంతే కాకుండా చిన్నప్పుడు శ్యాం ప్రసాద్ రెడ్డి తాత కూడా ఓ కోట గురించి చెబుతూ.. కోటలో రాజకుమారి పనివాడితో ఉండగా చూసిన రాజు ఇద్దరినీ చంపేసి అదే గదిలో వారిని సమాధి చేశాడని చెప్పాడట. ఈ రెండింటినీ మూలంగా చేసుకుని సినిమా చేయాలని శ్యాం ప్రసాద్ నిర్ణయించుకున్నారట. అప్పటికే అంజి ఫ్లాప్ తో ఉన్నప్పటికీ మరోసారి కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండే సినిమానే చేయాలని నిర్ణయం తీసుకున్నారట.
అలా అరుంధతి సినిమాకు బీజం పడింది. ఆ తరవాత దర్శకుడు కోడి రామకృష్ణను పిలిచి కథను డెవలప్ చేశారు. అనంతరం అనుష్కను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక సినిమాలో కోట కోసం రూ.8 కోట్లతో సెట్ ను వేశారు. అంతే కాకుండా అనుష్క కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. అనుష్క, దర్శక నిర్మాతల కష్టానికి ఫలితంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే అరుంధతి కథ నిజంగా జరిగింది కాకపోయినా.. సినిమాను చూస్తే మాత్రం అలాంటి ఫీల్ వస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…