Arundhati Movie : సూపర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ముద్దుగుమ్మ అనుష్క. ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. వరుస సూపర్ హిట్ లు అందుకోవడంతో హీరోల రేంజ్ లో అనుష్క క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటికీ అనుష్క కోసం సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారంటే ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ ప్రారంభంలో కేవలం హీరోల పక్కన సినిమాలు చేసిన అనుష్క ఆ తరవాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ అదరగొట్టింది.
అనుష్క లీడ్ రోల్ చేసిన అరుంధతి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో అనుష్క నటనకు అంతా ఫిదా అయ్యారు. ఈ చిత్రాన్ని శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. కోడి రామకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు తెర వెనుక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ నడిచింది. ఓ పార్టీలో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి బంధువు పదే పదే గద్వాల్ కోట గురించి మాట్లాడుతండగా ఆయనకు ఆసక్తికరంగా అనిపించిందట.
అంతే కాకుండా చిన్నప్పుడు శ్యాం ప్రసాద్ రెడ్డి తాత కూడా ఓ కోట గురించి చెబుతూ.. కోటలో రాజకుమారి పనివాడితో ఉండగా చూసిన రాజు ఇద్దరినీ చంపేసి అదే గదిలో వారిని సమాధి చేశాడని చెప్పాడట. ఈ రెండింటినీ మూలంగా చేసుకుని సినిమా చేయాలని శ్యాం ప్రసాద్ నిర్ణయించుకున్నారట. అప్పటికే అంజి ఫ్లాప్ తో ఉన్నప్పటికీ మరోసారి కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండే సినిమానే చేయాలని నిర్ణయం తీసుకున్నారట.
అలా అరుంధతి సినిమాకు బీజం పడింది. ఆ తరవాత దర్శకుడు కోడి రామకృష్ణను పిలిచి కథను డెవలప్ చేశారు. అనంతరం అనుష్కను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక సినిమాలో కోట కోసం రూ.8 కోట్లతో సెట్ ను వేశారు. అంతే కాకుండా అనుష్క కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. అనుష్క, దర్శక నిర్మాతల కష్టానికి ఫలితంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే అరుంధతి కథ నిజంగా జరిగింది కాకపోయినా.. సినిమాను చూస్తే మాత్రం అలాంటి ఫీల్ వస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…