వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన కుమార్తె సునీతా రెడ్డి అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు నేపథ్యంలో ఆమె శుక్రవారం ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిశారు. తన తండ్రి హత్య కేసును త్వరగా దర్యాప్తు చేయాలని, దోషులను పట్టుకుని శిక్షించాలని ఆమె కోరారు. తమలాంటి వారికే న్యాయం జరగకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.
తన తండ్రి హత్య కేసు విషయమై ఓ ఉన్నతాధికారిని కలిశానని, కానీ ఆయన ఇలాంటివన్నీ సహజమని, మరిచిపోవాలని, లేదంటే అది నా పిల్లలపై ప్రభావం చూపుతుందని అన్నారని.. ఇందుకు బాధగా ఉందని అన్నారు. తాను రాజకీయ వేత్తను, సామాజిక కార్యకర్తను కాను అని అన్నారు. తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు ఇంకా ముందుకు కొనసాగకపోవడం విచారకరమన్నారు.
వివేకా హత్య జరిగి 2 ఏళ్లు అవుతుందని, అయినప్పటికీ ఇప్పటి వరకు హంతకులను పట్టుకోలేదని అన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి సోదరుడి హత్యను ఇంత తేలిగ్గా తీసుకోవడ తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. ఇప్పటికైనా కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సునీతా రెడ్డి కోరారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…