జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు ఏపీ మహిళా కమిషన్ షాకిచ్చింది. ఆయన ఈమధ్యే తన మూడు పెళ్లిళ్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే పవన్ను ఏపీ మంత్రులు సహా సీఎం జగన్ కూడా విమర్శించారు. అయితే ఇదే విషయమై ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. ఈ క్రమంలోనే ఆ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్కు నోటీసులు జారీ చేశారు. మహిళలకు పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆదేశించారు.
పవన్ ఈ మధ్య జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తాను చట్టప్రకారం విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అన్నారు. ఏపీ మంత్రుల్లా 30 మందిని వెనకేసుకుని తిరగడం లేదన్నారు. మొదటి భార్యకు రూ.5 కోట్ల భరణం ఇచ్చానని.. రెండో భార్యకు ఆస్తిలో వాటా ఇచ్చానని చెప్పారు. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ పవన్ తన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. అలాగే మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలన్నారు.
ఇటీవల పవన్ చేసిన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారాన్ని రేపాయని పద్మ అన్నారు. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్ని ఇస్తూ పవన్ మాట్లాడిన మాటలకు మహిళా లోకం షాక్కు గురైందన్నారు. పవన్ తన మాటల్లోని తప్పును తెలుసుకోవాలని.. వెంటనే సంజాయిషీ ఇవ్వాలని అన్నారు. ఇన్ని రోజులైనప్పటికీ పవన్ లో పశ్చాత్తాపం లేదని.. మహిళల ఆత్మగౌరవం దెబ్బ తీసేలా మాట్లాడారని అన్నారు. పవన్ ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సమాజంపై ప్రభావం ఉండదా.. అని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు.
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…
పబ్లిక్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన…
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…