నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగారు. ఒకపక్క ఇండస్ట్రీలో రామారావు, నాగేశ్వరరావు ఓ వెలుగు వెలుగు వెలుగుతున్న సమయంలోనే కొణిదెల శివకుమార్ అనే కుర్రాడు మొగల్తూరు నుంచి మద్రాసులో అడుగుపెట్టి నేడు మెగాస్టార్ గా ఎదిగాడు. చిరు ఇప్పటికి 150కి పైగా సినిమాల్లో నటించాడు. సినీ డాన్సుకి డెఫినేషన్ చెప్పిన నటుడు చిరంజీవి. యాక్టింగ్ లో చిరు ఈజ్, డాన్స్ లో ఆయన చరిష్మా ఎవరికి రాదనే చెప్పవచ్చు. చిరంజీవి నట ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ ఏఎన్నార్ తో కూడా చిరంజీవి సినిమాలు చేశారు.
అక్కినేని నాగేశ్వరరావుతో చిరంజీవి మెకానిక్ అల్లుడు అనే సినిమాలో నటించారు. అంతేకాకుండా ఎన్టీ రామారావుతో తిరుగులేని మనిషి సినిమాలో నటించారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తో మరో సినిమా చేసే అవకాశం కూడా చిరంజీవికి వచ్చింది. కానీ 5 రోజుల షూటింగ్ తర్వాత చిరంజీవి స్థానంలో మోహన్ బాబును తీసుకున్నారు. ఆ సినిమా ఏంటి మెగాస్టార్ ను ఎందుకు తీసేసారు అంటే.. ఎన్టీఆర్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కొండవీటి సింహం సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొడుకు పాత్ర కోసం మొదట చిరంజీవిని తీసుకున్నారు. అయితే సినిమాలో ఎన్టీఆర్ కొడుకుగా నటించిన చిరంజీవి ఆయనను ఎదిరిస్తూ పవర్ ఫుల్ డైలాగులు చెప్పాల్సి ఉంటుంది.
చిరంజీవి కూడా పాత్రకు ఒప్పుకున్నారు. 5 రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఎన్టీఆర్ ను ఎదిరిస్తూ డైలాగులు చెప్పేందుకు చిరంజీవి తడబడ్డారు. దానికి కారణం ఎన్టీఆర్ అప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరో గా ఉన్నారు. కానీ చిరంజీవి అప్పుడప్పుడే కెరీర్ ను గాడిలో పెట్టుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ ఆ సినిమా కోసం కేవలం 30 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారు. దాంతో షూటింగ్ ఇలాగే జరిగితే కష్టమని మేకర్స్ భావించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి స్థానంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబును తీసుకున్నారు. అలా మోహన్ బాబు ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో మోహన్ బాబు ఎన్టీఆర్ తో పోటీగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…