Tollywood : గత కొద్ది నెలలుగా అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదాలు చెలరేగుతున్నాయి. గతంలో పవన్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి. ఆయన ఏపీ ప్రభుత్వం, మంత్రులపై విమర్శలు చేశారు. దీంతో పవన్ను ఏపీ మంత్రులు విమర్శించారు.
పవన్ లాంటి అగ్ర హీరోలు అంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే బదులు దాన్ని తగ్గించుకుంటే.. తగ్గిన సినిమా టిక్కెట్ ధరలతో పెద్ద నష్టమేమీ ఉండదని మంత్రులు అన్నారు. దీంతో ఈ వివాదం అప్పట్లో చిలికి చిలికి గాలివాన అయింది. ఆ తరువాత అది పవన్ వర్సెస్ పోసానిగా మారింది. ఇక ఆ తరువాత మా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. దీంతో ఈ వివాదాన్ని చాలా మంది మరిచిపోయారు.
కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఏ విషయాన్ని మరిచిపోలేదు. జీవోల మీద జీవోలు తెచ్చింది. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దీని తరువాత కరోనా మూడో వేవ్ వచ్చింది. దీంతో పెద్ద సినిమాలు అన్నీ విడుదలను వాయిదా వేసుకున్నాయి. కాగా ఈ మధ్యే చిరంజీవి మరోమారు సీఎం జగన్ను కలిశారు. ఈ క్రమంలో సయోధ్య కుదిరిందని.. త్వరలోనే టాలీవుడ్కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెబుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవే నిజం కానున్నాయా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వం త్వరలోనే సినిమా టిక్కెట్ ధరలపై మళ్లీ కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. సినిమా టిక్కెట్ల ధరలను థియేటర్లు అవసరం అయినప్పుడు పెంచుకునేలా మళ్లీ ఇంకో జీవోను విడుదల చేస్తారని సమాచారం. అదే జరిగితే టాలీవుడ్కు పండుగ చేసుకునే వార్త అని చెప్పవచ్చు. దీంతో త్వరలో విడుదల కానున్న సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై పాజిటివ్గా ఉందని కూడా తెలిసింది. మరి ఆ జీవోను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…