Tollywood : గత కొద్ది నెలలుగా అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదాలు చెలరేగుతున్నాయి. గతంలో పవన్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి. ఆయన ఏపీ ప్రభుత్వం, మంత్రులపై విమర్శలు చేశారు. దీంతో పవన్ను ఏపీ మంత్రులు విమర్శించారు.
పవన్ లాంటి అగ్ర హీరోలు అంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే బదులు దాన్ని తగ్గించుకుంటే.. తగ్గిన సినిమా టిక్కెట్ ధరలతో పెద్ద నష్టమేమీ ఉండదని మంత్రులు అన్నారు. దీంతో ఈ వివాదం అప్పట్లో చిలికి చిలికి గాలివాన అయింది. ఆ తరువాత అది పవన్ వర్సెస్ పోసానిగా మారింది. ఇక ఆ తరువాత మా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. దీంతో ఈ వివాదాన్ని చాలా మంది మరిచిపోయారు.
కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఏ విషయాన్ని మరిచిపోలేదు. జీవోల మీద జీవోలు తెచ్చింది. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దీని తరువాత కరోనా మూడో వేవ్ వచ్చింది. దీంతో పెద్ద సినిమాలు అన్నీ విడుదలను వాయిదా వేసుకున్నాయి. కాగా ఈ మధ్యే చిరంజీవి మరోమారు సీఎం జగన్ను కలిశారు. ఈ క్రమంలో సయోధ్య కుదిరిందని.. త్వరలోనే టాలీవుడ్కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెబుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవే నిజం కానున్నాయా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వం త్వరలోనే సినిమా టిక్కెట్ ధరలపై మళ్లీ కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. సినిమా టిక్కెట్ల ధరలను థియేటర్లు అవసరం అయినప్పుడు పెంచుకునేలా మళ్లీ ఇంకో జీవోను విడుదల చేస్తారని సమాచారం. అదే జరిగితే టాలీవుడ్కు పండుగ చేసుకునే వార్త అని చెప్పవచ్చు. దీంతో త్వరలో విడుదల కానున్న సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై పాజిటివ్గా ఉందని కూడా తెలిసింది. మరి ఆ జీవోను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…