Tollywood : గత కొద్ది నెలలుగా అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదాలు చెలరేగుతున్నాయి. గతంలో పవన్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి. ఆయన ఏపీ ప్రభుత్వం, మంత్రులపై విమర్శలు చేశారు. దీంతో పవన్ను ఏపీ మంత్రులు విమర్శించారు.
పవన్ లాంటి అగ్ర హీరోలు అంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే బదులు దాన్ని తగ్గించుకుంటే.. తగ్గిన సినిమా టిక్కెట్ ధరలతో పెద్ద నష్టమేమీ ఉండదని మంత్రులు అన్నారు. దీంతో ఈ వివాదం అప్పట్లో చిలికి చిలికి గాలివాన అయింది. ఆ తరువాత అది పవన్ వర్సెస్ పోసానిగా మారింది. ఇక ఆ తరువాత మా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. దీంతో ఈ వివాదాన్ని చాలా మంది మరిచిపోయారు.
కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఏ విషయాన్ని మరిచిపోలేదు. జీవోల మీద జీవోలు తెచ్చింది. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దీని తరువాత కరోనా మూడో వేవ్ వచ్చింది. దీంతో పెద్ద సినిమాలు అన్నీ విడుదలను వాయిదా వేసుకున్నాయి. కాగా ఈ మధ్యే చిరంజీవి మరోమారు సీఎం జగన్ను కలిశారు. ఈ క్రమంలో సయోధ్య కుదిరిందని.. త్వరలోనే టాలీవుడ్కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెబుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవే నిజం కానున్నాయా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వం త్వరలోనే సినిమా టిక్కెట్ ధరలపై మళ్లీ కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. సినిమా టిక్కెట్ల ధరలను థియేటర్లు అవసరం అయినప్పుడు పెంచుకునేలా మళ్లీ ఇంకో జీవోను విడుదల చేస్తారని సమాచారం. అదే జరిగితే టాలీవుడ్కు పండుగ చేసుకునే వార్త అని చెప్పవచ్చు. దీంతో త్వరలో విడుదల కానున్న సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై పాజిటివ్గా ఉందని కూడా తెలిసింది. మరి ఆ జీవోను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…