Andhra Pradesh : కొన్ని గంటలలో ఆమె పెళ్లి పీటలపై కూర్చుని వరుడి చేత మూడు ముళ్ళు వేయించుకోవాల్సి ఉంది. అయితే తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుంది. అలా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ వధువు కుటుంబ సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చింది.
మదన పల్లె మండలం తట్టివారి పల్లెకు చెందిన రామకృష్ణ, మల్లిక దంపతుల కుమార్తె సోనికకు అదే ఊరుకి చెందిన నవీన్ కుమార్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. నవంబర్ 14వ తేదీన వీరి పెళ్లి జరగాల్సి ఉండగా ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేశాయి. రాత్రి ఎవరి గదుల్లో వారు పడుకున్న తర్వాత పెళ్లి కూతురు సోనికా ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఉదయానికి వధువు కనిపించకపోవడంతో ఎన్ని చోట్ల వెతికినా ఫలితం లేకుండాపోయింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా సోనిక గొల్లపల్లెకు చెందిన చరణ్ అనే యువకుడిని ప్రేమించింది. వారిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం వారిద్దరూ.. ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కావాలని కోరుతూ.. అదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అయితే ఆమె మేజర్ కావడంతో తన ఇష్ట ప్రకారమే నడుచుకోవాలని.. వారిని విడదీయడానికి కుదరదంటూ.. పోలీసులు వారి కుటుంబ సభ్యులకు.. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…