Andhra Pradesh : కొన్ని గంటలలో ఆమె పెళ్లి పీటలపై కూర్చుని వరుడి చేత మూడు ముళ్ళు వేయించుకోవాల్సి ఉంది. అయితే తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుంది. అలా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ వధువు కుటుంబ సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చింది.
మదన పల్లె మండలం తట్టివారి పల్లెకు చెందిన రామకృష్ణ, మల్లిక దంపతుల కుమార్తె సోనికకు అదే ఊరుకి చెందిన నవీన్ కుమార్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. నవంబర్ 14వ తేదీన వీరి పెళ్లి జరగాల్సి ఉండగా ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేశాయి. రాత్రి ఎవరి గదుల్లో వారు పడుకున్న తర్వాత పెళ్లి కూతురు సోనికా ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఉదయానికి వధువు కనిపించకపోవడంతో ఎన్ని చోట్ల వెతికినా ఫలితం లేకుండాపోయింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా సోనిక గొల్లపల్లెకు చెందిన చరణ్ అనే యువకుడిని ప్రేమించింది. వారిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం వారిద్దరూ.. ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కావాలని కోరుతూ.. అదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అయితే ఆమె మేజర్ కావడంతో తన ఇష్ట ప్రకారమే నడుచుకోవాలని.. వారిని విడదీయడానికి కుదరదంటూ.. పోలీసులు వారి కుటుంబ సభ్యులకు.. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…