Andhra Pradesh : ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో చెప్పలేని పరిస్థితి. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ లో ఎన్నో మార్పులు జరిగాయి. లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజనపై దృష్టి పెట్టారు. వైఎస్ ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జరిగిన చర్చలలో కొత్త జిల్లాలపై సీఎం కీలకమైన చర్చను నిర్వహించారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అందుకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందట. ఇక నోటిఫికేషన్ కూడా జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత జనగణన ముగిసేవరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ భౌగోళిక హద్దులు మార్చడానికి కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందుకే జిల్లాల పునర్విభజనకు బ్రేక్ పడింది. ఏపీ రాష్ట్రంలో లోక్ సభ పార్లమెంట్ కు ఒక జిల్లాగా డివైడ్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. ఈ రకంగా విభజిస్తే.. ఏపీకి 26 జిల్లాలు వస్తాయి. కొత్త జిల్లాలపై స్టేట్ లెవల్ కమిటీ, సబ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో లోక్ సభ నియోజకవర్గాలను చూస్తే.. 25 జిల్లాలు వస్తున్నాయి.
ముఖ్యంగా అరకు పార్లమెంట్ పెద్దది కనుక ఆ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలు చేసే పనిలో ఉంది. ఈ జిల్లాలను విభజించే క్రమంలో కాలేజీలు, రోడ్లు, మెయిన్ బిల్డింగ్స్ లాంటి వాటిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుంది. లోక్ సభ నియోజకవర్గాల పరిధి, విస్తీర్ణం, రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలను పరిగణనలోకి తీసుకున్నారు. పోలీసు శాఖ సైతం తమకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. ఈ కొత్త జిల్లాల టాపిక్ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడే వచ్చినా.. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ అంశం తెరపైకి వచ్చింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…