Sreemukhi : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు శ్రీముఖి. జులాయి సినిమాతో నటిగా పలకరించిన ఈ అమ్మడు ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. అయితే పటాస్ సినిమాతో బుల్లితెర రాములమ్మగా మారి ప్రేక్షకులని అలరిస్తోంది. కొద్ది రోజుల పాటు వరుస టీవీ షోలతో తెగ అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అడపాదడపా కనిపిస్తోంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్గా మారి తన క్యూట్ లుక్స్తో అలరిస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్సులో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో శ్రీముఖి క్యూట్ లుక్స్ ను చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు.
శ్రీముఖి నంబర్ వన్ పొజిషన్ ఇంకా అందుకోలేకున్నా.. ఈవెంట్స్, రెమ్యూనరేషన్స్, సంపాదనలో తక్కువేమీ కాదు. శ్రీముఖి వయసులో చిన్నదైనా కానీ.. తెలివితేటలతో పలు రంగాల్లో రాణిస్తోంది. ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా.. శ్రీముఖి ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. బిగ్ బాస్ షోతో ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా బాగా అందుకున్నట్టు సమాచారం. హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ తో మాల్దీవ్స్ కు చెక్కేసి, అక్కడ తెగ ఎంజాయ్ చేసింది శ్రీముఖి.
పుష్పలో బన్నీడైలాగ్ కంటే శ్రీముఖి రచ్చే తగ్గేదెలే అనేట్టుగా ఉంటోంది. ఒకవైపు టీవీ షోలతో సందడి చేస్తున్నా కూడా వెండితెరపై అడపాదడా సందడి చేస్తోంది. ఇటీవల క్రేజీ అంకుల్స్ చిత్రంతో పలకరించిన శ్రీముఖి ఇప్పుడు భోళా శంకర్ చిత్రంలో చిరంజీవితోపాటు నటిస్తుంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన షూటింగ్ పూర్తైనట్టు సమాచారం. మరోవైపు సరిగమప అనే టీవీ షో చేస్తోంది శ్రీముఖి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…