Anchor Rashmi Gautam : బుల్లితెర స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా ఈమె మరింత పాపులర్ అయ్యింది. అప్పుడప్పుడు సినిమాల్లోనూ, పలు ఇతర షోల్లోనూ కనిపిస్తూ సందడి చేస్తోంది. అయితే బుల్లితెరపై రష్మి, సుధీర్ ఒకే వేదికపై కనిపిస్తే.. వీరు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆ షోకు రేటింగ్స్ కూడా బాగానే వస్తుంటాయి.
బుల్లితెరపై యాంకర్ రష్మి గౌతమ్, సుధీర్లు పండించే హాస్యానికి, వారి మధ్య ఉండే లవ్ ట్రాక్కు ప్రేక్షకులు ఎంతో ఫిదా అవుతుంటారు. అయితే తాజాగా రష్మికి చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈమె గతేడాది లాక్ డౌన్ సమయంలోనే రహస్యంగా పెళ్లి చేసుకుందని వార్తలు వస్తున్నాయి.
గతంలో సుధీర్తో రష్మి లవ్ ట్రాక్ నడిపిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ వారు ఇద్దరూ ఆ వార్తలను ఖండించారు. ఆ ట్రాక్ కేవలం షోలకు మాత్రమే పరిమితమని క్లారిటీ ఇచ్చారు. తాము ఇద్దరమూ మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా హల్ చల్ చేస్తున్న వార్తల ప్రకారం.. రష్మి.. ఇండస్ట్రీతో సంబంధం లేని ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకున్నదట. అతను ఓ ప్రయివేటు సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. భర్తతో ఆమె హైదరాబాద్లోనే ఉంటుందట. అయితే ఈ విషయం బయటకు వస్తే కెరీర్ పరంగా తనకు ఇబ్బందులు వస్తాయని రష్మి భావించిందట. దీంతోనే తన పెళ్లి విషయాన్ని ఈమె చాలా సీక్రెట్గా ఉంచిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉంది ? అన్నది తెలియాల్సి ఉంది.
ఇక త్వరలోనే రష్మి తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని అంటున్నారు. గతంలో యాంకర్ రవి కూడా తనకు పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టాడు. దీంతో రష్మి కూడా అదే కోవలో వెళ్తుందా ? అని సందేహిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మి దీనిపై స్పందిస్తుందా..? లేదా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…