Anchor Jhansi : బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా పలు పాత్రల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్లలో.. సీనియర్ యాంకర్ ఝాన్సీ కూడా ఒకరు. ఈమె ప్రస్తుతం ఎక్కువగా కనిపించడం లేదు. ఒకప్పుడు ఈమె ఉదయభాను, సుమతోపాటు టీవీల్లో ఎక్కువగా కనిపించి అలరించారు. అయితే ప్రస్తుతం బుల్లితెరపై ఈమె పెద్దగా కనిపించడం లేదు. ఇక ఝాన్సీ ముక్కు సూటి మనిషి అని చెప్పవచ్చు. ఆమె ఏం ఉన్నా సరే ముఖం మీదే చెప్పేస్తారు. ఈ క్రమంలోనే ఆమె జీవితంలోనూ అనేక కష్టనష్టాలను చవి చూసింది.
ఝాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె జీవితం, సంసారం సరిగ్గా సాగలేదు. ఒక కుమార్తె జన్మించాక ఆమె భర్తతో విడాకులు తీసుకున్నారు. జోగి బ్రదర్స్లో ఒకరిని ఆమె పెళ్లి చేసుకున్న విషయం విదితమే. ఇక ఆమెకు చిన్న వయస్సులోనే విడాకులు అయ్యాయి. కానీ ఆమె మరో పెళ్లి చేసుకోలేదు. కుమార్తెను గారాబంగా పెంచుకుంటూ జీవితం గడుపుతోంది. ఇక తన కుమార్తె మాత్రమే కాక ఆమె ఇంకో ఇద్దరిని దత్తత తీసుకుని చదివిస్తోంది. ఆమె దాతృత్వ గుణం ఎలాంటిదో ఈ ఒక్క విషయం చాలు.
ఇక ఝాన్సీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు సంబంధించిన పలు విశేషాలను ఆమె తెలియజేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో సోషల్ మీడియాలో తాను చేసిన సెటైరికల్ పోస్ట్ వెనుక ఆంతర్యం ఏమిటో ఝాన్సీ తెలిపింది. ప్రస్తుతం మీడియా అతి ఎక్కువగా చేస్తుందని.. సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూస్తున్నారని.. నానా హడావిడి చేస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మా ఎన్నికల సమయంలో తాను.. అనగనగా ఒక ఎద్దు, దానికొక పుండు, పుండులో పురుగులు, ఏంటీ కాకుల గోల.. అని తాను మీడియాను ఉద్దేశించే అన్నానని.. అయితే ఈ పోస్టు తాను టాలీవుడ్ను ఉద్దేశించి పెట్టానని కొందరు భావించారని చెప్పింది.
ఇక ఝాన్సీ తనకు ఇష్టమైన ఆహారం గురించి కూడా చెప్పింది. తనకు రాగి సంగటి, జొన్న అన్నం, చద్దన్నం, పచ్చి పులుసు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ వంటివి చాలా ఇష్టమని, పండ్ల రసాలను ఎక్కువగా తాగుతానని.. తెలిపింది. తన కుమార్తె పేరు ధన్య అని.. ఢిల్లీలో బయోటెక్ రీసెర్చర్గా చేస్తుందని, ఆమెకు వయొలిన్ వాయించడం తెలుసని, భరత నాట్యం కూడా నేర్చుకుంటుందని చెప్పింది. తన కుమార్తె నటి కావాలనుకుంటే తాను వద్దని చెప్పబోనని.. కానీ ఆమె సైంటిస్టు కావాలని కలలు కంటుందని.. ఝాన్సీ తెలియజేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…