Anchor Jhansi : బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా పలు పాత్రల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్లలో.. సీనియర్ యాంకర్ ఝాన్సీ కూడా ఒకరు. ఈమె ప్రస్తుతం ఎక్కువగా కనిపించడం లేదు. ఒకప్పుడు ఈమె ఉదయభాను, సుమతోపాటు టీవీల్లో ఎక్కువగా కనిపించి అలరించారు. అయితే ప్రస్తుతం బుల్లితెరపై ఈమె పెద్దగా కనిపించడం లేదు. ఇక ఝాన్సీ ముక్కు సూటి మనిషి అని చెప్పవచ్చు. ఆమె ఏం ఉన్నా సరే ముఖం మీదే చెప్పేస్తారు. ఈ క్రమంలోనే ఆమె జీవితంలోనూ అనేక కష్టనష్టాలను చవి చూసింది.
ఝాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె జీవితం, సంసారం సరిగ్గా సాగలేదు. ఒక కుమార్తె జన్మించాక ఆమె భర్తతో విడాకులు తీసుకున్నారు. జోగి బ్రదర్స్లో ఒకరిని ఆమె పెళ్లి చేసుకున్న విషయం విదితమే. ఇక ఆమెకు చిన్న వయస్సులోనే విడాకులు అయ్యాయి. కానీ ఆమె మరో పెళ్లి చేసుకోలేదు. కుమార్తెను గారాబంగా పెంచుకుంటూ జీవితం గడుపుతోంది. ఇక తన కుమార్తె మాత్రమే కాక ఆమె ఇంకో ఇద్దరిని దత్తత తీసుకుని చదివిస్తోంది. ఆమె దాతృత్వ గుణం ఎలాంటిదో ఈ ఒక్క విషయం చాలు.
ఇక ఝాన్సీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు సంబంధించిన పలు విశేషాలను ఆమె తెలియజేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో సోషల్ మీడియాలో తాను చేసిన సెటైరికల్ పోస్ట్ వెనుక ఆంతర్యం ఏమిటో ఝాన్సీ తెలిపింది. ప్రస్తుతం మీడియా అతి ఎక్కువగా చేస్తుందని.. సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూస్తున్నారని.. నానా హడావిడి చేస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మా ఎన్నికల సమయంలో తాను.. అనగనగా ఒక ఎద్దు, దానికొక పుండు, పుండులో పురుగులు, ఏంటీ కాకుల గోల.. అని తాను మీడియాను ఉద్దేశించే అన్నానని.. అయితే ఈ పోస్టు తాను టాలీవుడ్ను ఉద్దేశించి పెట్టానని కొందరు భావించారని చెప్పింది.
ఇక ఝాన్సీ తనకు ఇష్టమైన ఆహారం గురించి కూడా చెప్పింది. తనకు రాగి సంగటి, జొన్న అన్నం, చద్దన్నం, పచ్చి పులుసు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ వంటివి చాలా ఇష్టమని, పండ్ల రసాలను ఎక్కువగా తాగుతానని.. తెలిపింది. తన కుమార్తె పేరు ధన్య అని.. ఢిల్లీలో బయోటెక్ రీసెర్చర్గా చేస్తుందని, ఆమెకు వయొలిన్ వాయించడం తెలుసని, భరత నాట్యం కూడా నేర్చుకుంటుందని చెప్పింది. తన కుమార్తె నటి కావాలనుకుంటే తాను వద్దని చెప్పబోనని.. కానీ ఆమె సైంటిస్టు కావాలని కలలు కంటుందని.. ఝాన్సీ తెలియజేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…