Anchor Jhansi : సినీ ఇండస్ట్రీలో నటిగా, యాంకర్ గా ఝాన్సీ సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటోంది. బుల్లితెరపై యాంకర్ ఝాన్సీ మొదట్నుంచి పలు వివాదాలకు స్పందిస్తుంది. ముఖ్యంగా సమాజంలో జరిగే విషయాలపై ఝాన్సీ రెస్పాన్డ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత పలు కామెంట్స్ కి గురవుతుంటుంది.
రీసెంట్ గా ఆమె మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ లో ఝాన్సీ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ప్రజలు ఎలాంటి వార్తలు కావాలనుకుంటారో అవి చూపించడం లేదని బలవంతంగా వారు చెప్పాలనుకున్న వార్తల్నే చెబుతున్నారనేలా ఓ సామెత చెప్పారు.
అనగనగా ఓ ఎద్దు.. దానికో పుండు, ఎద్దు పుండు కాకికి ముద్దు.. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి తిన్నాయి. పుండును పెద్దది చేశాయి.. ఎద్దు బుసలు కొట్టి రెచ్చిపోయింది. కాకులు గోల పెంచేస్తాయంటూ ఓ పోస్ట్ చేశారు. సెలెబ్రిటీలకు మైకులు పెట్టి మరీ మురికి గొట్టాలను జనాల ఇళ్లల్లోకి వెళ్ళేలా చేయడానికి అంతకు మించి మంచి వార్తలు లేవా.. అంటూ మండిపడ్డారు.
సెలెబ్రిటీల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగినా.. అవి పెటాకులైనా లేదా మరే వివాదాలు జరిగినా అదే అసలు సందడి అనుకుని హడావిడి చేస్తున్న కాకుల్లారా.. ప్రజా ప్రయోజన వార్తలంటే ఏంటో ఒకసారి డిక్షనరీలో చూడండి.. అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. మీడియాపై యాంకర్ ఝాన్సీ చేసిన వ్యాఖ్యల్ని కొంతమంది నెటిజన్లు సపోర్ట్ చేస్తుంటే.. మరికొంతమంది మండిపడుతున్నారు. సమంత విషయంపై అత్యుత్సాహం చూపడం వల్లనే ఆమె ఇలా కామెంట్ చేసి ఉంటుందని అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…