Anasuya : బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం తన కెరీర్లో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా పలు అంశాలపై స్పందిస్తూ తన దైన శైలిలో సెటైర్లు వేయడం చేస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా తన గురించి వచ్చే నెగెటివ్ కామెంట్స్ ను తిప్పికొడుతూ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న అనసూయ తాజాగా ట్విట్టర్ ద్వారా మరొక విషయంపై స్పందిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసింది.
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే పిల్లలను స్కూలుకు పంపించాలని తల్లిదండ్రులపై అధిక ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉండగా పిల్లలకు పాఠశాలలో ఎలాంటి ప్రమాదం జరిగినా స్కూల్ యాజమాన్యం బాధ్యత కాదని.. తల్లిదండ్రుల నుంచి డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ అక్కడక్కడ కేసులు నమోదు అవుతూ ఉన్నాయి.
అయితే కరోనా కేసులు తగ్గడంతో తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అలాగే వాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలోనే ఈ విషయంపై అనసూయ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సర్.. కరోనా కేసుల కారణంగా మనం లాక్ డౌన్ నిర్వహించాము. అలాగే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. మరి కరోనా వ్యాక్సిన్ తీసుకోని చిన్నారుల పరిస్థితి ఏంటి ? పిల్లలకు ఏమైనా జరిగితే అందుకు తాము బాధ్యులు కామని స్కూల్ యాజమాన్యాలు తెలియజేస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం సర్.. అంటూ ఆమె మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…