Anasuya : గ్లామరస్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విషయంపై వార్తలలో నిలుస్తూ ఉంటుంది అనసూయ. టీవీ9 యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయకు పాపులారిటీ వచ్చింది మాత్రం జబర్దస్త్ షో ద్వారానే. తన మాటలతోనే కాకుండా అందచందాలతోనూ అదరగొడుతూ కనుల విందు చేస్తోంది ఈ యాంకరమ్మ. అనసూయ వేసుకొనే పొట్టి బట్టలపై ఒక్కోసారి వివాదం చెలరేగుతూ ఉంటుంది. వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా అనసూయ గ్లామర్ షోతో అటు బుల్లితెర ప్రేక్షకులను, ఇటు వెండితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో కనిపించి అనసూయ తనలో కొత్త కోణాన్ని పరిచయం చేసింది. పుష్ప చిత్రంలో దాక్షాయని పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచింది. తనకంటూ నటన పరంగా ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం కొన్ని కారణాల వలన అనసూయ జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా అనసూయ ఒక ఇంటర్వ్యూ ద్వారా క్యాస్టింగ్ కౌచ్ అనే భూతం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను ఎప్పుడూ అవకాశాల కోసం వెళ్లలేదని, కేవలం వచ్చిన అవకాశాలను మాత్రమే సద్వినియోగం చేసుకున్నానని చెప్పుకొచ్చింది. అందరికీ రంగుల ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. సోషల్ మీడియా పరంగా ఎవరికి నచ్చిన విధంగా వారు కాస్టింగ్ కౌచ్ గురించి కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే పరిమితమై ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. లైంగిక వేధింపులు అనేవి కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే కాదు, మిగతా చోట్ల కూడా ఉన్నాయి అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అనసూయ.
అదృష్టవశాత్తూ నాకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని తెలిపింది. అవకాశాల కోసం మనం తప్పు చేయకుండా ఎదురు చూడాలని, అది మనం స్పందించే విధానంపై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. చాలామంది చెప్తూనే ఉంటారు.. నీకు ఆ సినిమాలో ఛాన్స్ కావాలంటే నువ్వు ఈ విధంగా చేయాలి అని.. మనం అలాంటి ఆఫర్లకు తలవంచకూడదు. దాని బదులు అవకాశాన్ని వదులుకోవడం ఉత్తమం. ఈ ఛాన్స్ కాకపోతే దానికి మించిన అవకాశం మన దగ్గరికి వస్తుంది అంటూ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది అనసూయ.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…