Anasuya : గ్లామరస్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విషయంపై వార్తలలో నిలుస్తూ ఉంటుంది అనసూయ. టీవీ9 యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయకు పాపులారిటీ వచ్చింది మాత్రం జబర్దస్త్ షో ద్వారానే. తన మాటలతోనే కాకుండా అందచందాలతోనూ అదరగొడుతూ కనుల విందు చేస్తోంది ఈ యాంకరమ్మ. అనసూయ వేసుకొనే పొట్టి బట్టలపై ఒక్కోసారి వివాదం చెలరేగుతూ ఉంటుంది. వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా అనసూయ గ్లామర్ షోతో అటు బుల్లితెర ప్రేక్షకులను, ఇటు వెండితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో కనిపించి అనసూయ తనలో కొత్త కోణాన్ని పరిచయం చేసింది. పుష్ప చిత్రంలో దాక్షాయని పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచింది. తనకంటూ నటన పరంగా ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం కొన్ని కారణాల వలన అనసూయ జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా అనసూయ ఒక ఇంటర్వ్యూ ద్వారా క్యాస్టింగ్ కౌచ్ అనే భూతం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను ఎప్పుడూ అవకాశాల కోసం వెళ్లలేదని, కేవలం వచ్చిన అవకాశాలను మాత్రమే సద్వినియోగం చేసుకున్నానని చెప్పుకొచ్చింది. అందరికీ రంగుల ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. సోషల్ మీడియా పరంగా ఎవరికి నచ్చిన విధంగా వారు కాస్టింగ్ కౌచ్ గురించి కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే పరిమితమై ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. లైంగిక వేధింపులు అనేవి కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే కాదు, మిగతా చోట్ల కూడా ఉన్నాయి అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అనసూయ.
అదృష్టవశాత్తూ నాకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని తెలిపింది. అవకాశాల కోసం మనం తప్పు చేయకుండా ఎదురు చూడాలని, అది మనం స్పందించే విధానంపై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. చాలామంది చెప్తూనే ఉంటారు.. నీకు ఆ సినిమాలో ఛాన్స్ కావాలంటే నువ్వు ఈ విధంగా చేయాలి అని.. మనం అలాంటి ఆఫర్లకు తలవంచకూడదు. దాని బదులు అవకాశాన్ని వదులుకోవడం ఉత్తమం. ఈ ఛాన్స్ కాకపోతే దానికి మించిన అవకాశం మన దగ్గరికి వస్తుంది అంటూ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది అనసూయ.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…