Anasuya : ఓ వైపు బుల్లితెరపై సత్తా చాటుతూనే మరోవైపు వెండితెరపై కూడా అనసూయ ఎంతో బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన అనేక చిత్రాలు హిట్ అవుతున్నాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా పుష్ప సినిమాలో ఆమె దాక్షాయణి పాత్రలో కనిపించి అలరించింది. తరువాత రవితేజ ఖిలాడి మూవీలోనూ నటించింది. అయితే ఈ మూవీ హిట్ సాధించలేదు. కానీ అనసూయకు ఫుల్ లెంగ్త్ రోల్ లభించింది. దీంతో ఆమె తన నటనను ప్రదర్శించేందుకు మంచి అవకాశం లభించినట్లు అయింది. ఇక త్వరలో పుష్ప 2 షూటింగ్లోనూ ఈమె పాల్గొననుంది.
అయితే కేవలం సినిమాలు.. టీవీ షోలతోనే కాకుండా.. అనసూయ సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ను తన ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఇక తాజాగా అనసూయ పెట్టిన ఓ వీడియో వైరల్గా మారింది. అందులో ఆమె ఓ కొటేషన్ను షేర్ చేయడం విశేషం. అందులో ఏముందంటే.. నీ నటన, నీ లుక్, నువ్వు మాట్లాడే విధానం.. వంటి అంశాలను ఎవరైతే ఇష్టపడరో.. వారు నీవాళ్లు కాదు.. వాళ్లను మెప్పించడం కోసం నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన పనిలేదు.. నువ్వే.. నిన్నంటే ఇష్టపడే వారి మధ్య ఉండు.. నిన్ను ఇష్టపడని వాళ్లకు దూరంగా ఉండు.. నీలా నువ్వు ఉన్నందుకు నువ్వు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన పని కూడా లేదు.. అని అనసూయ ఆ వీడియోలో ఓ కొటేషన్ను షేర్ చేసింది.
సాధారణంగా అనసూయను ఇష్టపడే వారు ఎంత మంది ఉంటారో.. సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్లు చేసేవారు కూడా అంతే మంది ఉన్నారు. కనుక అలాంటి వాళ్లకు దూరంగా ఉండాలని.. వారు అనేది పట్టించుకోకూడదని.. ఆమె ఇలా ఇన్డైరెక్ట్గా ఓ కొటేషన్ను షేర్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక అనసూయ ప్రస్తుతం సినిమా షూటింగ్లతోనే కాకుండా టీవీ షోలతోనూ ఎంతో బిజీగా ఉంది. ఇతర భాషలకు చెందిన మూవీల్లోనూ ఈమె నటిస్తోంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…