Anasuya : ఓ వైపు బుల్లితెరపై సత్తా చాటుతూనే మరోవైపు వెండితెరపై కూడా అనసూయ ఎంతో బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన అనేక చిత్రాలు హిట్ అవుతున్నాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా పుష్ప సినిమాలో ఆమె దాక్షాయణి పాత్రలో కనిపించి అలరించింది. తరువాత రవితేజ ఖిలాడి మూవీలోనూ నటించింది. అయితే ఈ మూవీ హిట్ సాధించలేదు. కానీ అనసూయకు ఫుల్ లెంగ్త్ రోల్ లభించింది. దీంతో ఆమె తన నటనను ప్రదర్శించేందుకు మంచి అవకాశం లభించినట్లు అయింది. ఇక త్వరలో పుష్ప 2 షూటింగ్లోనూ ఈమె పాల్గొననుంది.
అయితే కేవలం సినిమాలు.. టీవీ షోలతోనే కాకుండా.. అనసూయ సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ను తన ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఇక తాజాగా అనసూయ పెట్టిన ఓ వీడియో వైరల్గా మారింది. అందులో ఆమె ఓ కొటేషన్ను షేర్ చేయడం విశేషం. అందులో ఏముందంటే.. నీ నటన, నీ లుక్, నువ్వు మాట్లాడే విధానం.. వంటి అంశాలను ఎవరైతే ఇష్టపడరో.. వారు నీవాళ్లు కాదు.. వాళ్లను మెప్పించడం కోసం నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన పనిలేదు.. నువ్వే.. నిన్నంటే ఇష్టపడే వారి మధ్య ఉండు.. నిన్ను ఇష్టపడని వాళ్లకు దూరంగా ఉండు.. నీలా నువ్వు ఉన్నందుకు నువ్వు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన పని కూడా లేదు.. అని అనసూయ ఆ వీడియోలో ఓ కొటేషన్ను షేర్ చేసింది.
సాధారణంగా అనసూయను ఇష్టపడే వారు ఎంత మంది ఉంటారో.. సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్లు చేసేవారు కూడా అంతే మంది ఉన్నారు. కనుక అలాంటి వాళ్లకు దూరంగా ఉండాలని.. వారు అనేది పట్టించుకోకూడదని.. ఆమె ఇలా ఇన్డైరెక్ట్గా ఓ కొటేషన్ను షేర్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక అనసూయ ప్రస్తుతం సినిమా షూటింగ్లతోనే కాకుండా టీవీ షోలతోనూ ఎంతో బిజీగా ఉంది. ఇతర భాషలకు చెందిన మూవీల్లోనూ ఈమె నటిస్తోంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…