Anasuya : గత కొంతకాలం వరకు జబర్దస్త్ షో లో యాంకర్ గా అందరినీ అలరించింది అనసూయ. అనసూయ యాంకర్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది జబర్దస్త్ షో ద్వారానే. గల గలా మాట్లాడుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేది. ఇద్దరు పిల్లల తల్లి అయినా చెక్కుచెదరని అందంతోపాటు సినిమాలలోనూ, ఇటు బుల్లితెర ప్రేక్షకులనూ అలరిస్తోంది. అనసూయకు ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు. మంచి టాలెంట్ తోపాటు, తనకు ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే మాట్లాడేస్తుంది అనసూయ. అనసూయకి సంబంధించి లేటెస్ట్ లుక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంటాయి.
అయితే తాజాగా అనసూయ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ ద్వారా అనసూయ ఎన్నో విషయాలను వెల్లడించింది. బాడీ షేమింగ్ కామెంట్లు నచ్చకపోవడంతో నేను జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నాను అంటూ పరోక్షంగా ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా చెప్పుకొచ్చింది. నేను సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. భయపడుతూనే టీవీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. నేను ఈ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాను అంటేనే మా వాళ్ళలో చాలామంది వామ్మో ముఖానికి మేకప్ వేసుకున్నావా ఏంటి. అందరి ముందు అలా బట్టలు వేసుకొని కెమెరా ముందు నటిస్తావా.. అంటూ నన్ను గుచ్చి గుచ్చి అడిగేవారు.
కానీ నేను అలాంటి ప్రశ్నలను ఏమీ పట్టించుకోకుండా ధైర్యంగా నా ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలని నా పని నేను చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాను. మొదట్లో నన్ను అందరూ విచిత్రంగా చూసేవారు. చచ్చినా తప్పుడు పనులు చెయ్యను అని ముఖం మీద చెప్పేదాన్ని . నేను ఎంచుకున్న దారి నాకు కంఫర్ట్ ని ఇచ్చింది. కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, నాకు నచ్చకపోయినా ఇష్టంగానే కొనసాగాను అంటూ చెప్పుకొచ్చింది అనసూయ. మొదట్లో ఎంతో బాగున్న టీవీ ఇండస్ట్రీ ఇప్పుడు కలుషితమై పోయిందని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా నా క్యారెక్టర్ బ్యాడ్ చేసే ఏ ఒక సందర్భాన్ని కూడా నేను సహించలేను. వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతాను.. అని పరోక్షంగా జబర్దస్త్ నుంచి బయటికి రావడానికి గల కారణాన్ని చెప్పేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…