Anasuya : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్ అనంతర బయటకు వచ్చిన.. వారి ప్యానెల్లో ఒక సభ్యురాలు అయిన నటి, యాంకర్ అనసూయ.. మీడియాపై నిప్పులు చెరిగింది. కోర్టుకెళతానని మీడియాకు వార్నింగ్ ఇచ్చింది.
తమ ప్యానెల్ సభ్యులు చెప్పాల్సిందంతా ప్రెస్ మీట్లో చెప్పేశారని, తాను చెప్పేది ఏమీ లేదని తెలిపింది. ఎన్నికల ఫలితాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు రాగానే గెలిచానని కొందరు కంగ్రాట్స్ చెప్పారని.. అంత వేగంగా బయటకు సమాచారం ఎలా వచ్చిందని ? ఆమె ప్రశ్నించింది. అలాగే రాత్రికి రాత్రే ఫలితాలు ఎలా తారుమారు అయ్యాయి ? అని ప్రశ్నలు వేసింది.
ఇక కొన్ని మీడియా చానల్స్, వెబ్సైట్స్, పత్రికలు తన గురించి అబద్దాలు రాస్తున్నాయని.. అలాంటి వాళ్లకు, సంస్థలకు వార్నింగ్ ఇస్తున్నానని.. నిజాలు రాయాలని.. తన ప్రమేయం లేకుండా తమ గురించి రాసినా.. తప్పుడు వార్తలను ప్రసారం చేసినా.. అలాంటి వారిపై కోర్టుకెళతానని అనసూయ హెచ్చరించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…