Anasuya : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్ అనంతర బయటకు వచ్చిన.. వారి ప్యానెల్లో ఒక సభ్యురాలు అయిన నటి, యాంకర్ అనసూయ.. మీడియాపై నిప్పులు చెరిగింది. కోర్టుకెళతానని మీడియాకు వార్నింగ్ ఇచ్చింది.
తమ ప్యానెల్ సభ్యులు చెప్పాల్సిందంతా ప్రెస్ మీట్లో చెప్పేశారని, తాను చెప్పేది ఏమీ లేదని తెలిపింది. ఎన్నికల ఫలితాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు రాగానే గెలిచానని కొందరు కంగ్రాట్స్ చెప్పారని.. అంత వేగంగా బయటకు సమాచారం ఎలా వచ్చిందని ? ఆమె ప్రశ్నించింది. అలాగే రాత్రికి రాత్రే ఫలితాలు ఎలా తారుమారు అయ్యాయి ? అని ప్రశ్నలు వేసింది.
ఇక కొన్ని మీడియా చానల్స్, వెబ్సైట్స్, పత్రికలు తన గురించి అబద్దాలు రాస్తున్నాయని.. అలాంటి వాళ్లకు, సంస్థలకు వార్నింగ్ ఇస్తున్నానని.. నిజాలు రాయాలని.. తన ప్రమేయం లేకుండా తమ గురించి రాసినా.. తప్పుడు వార్తలను ప్రసారం చేసినా.. అలాంటి వారిపై కోర్టుకెళతానని అనసూయ హెచ్చరించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…