Anasuya : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్ అనంతర బయటకు వచ్చిన.. వారి ప్యానెల్లో ఒక సభ్యురాలు అయిన నటి, యాంకర్ అనసూయ.. మీడియాపై నిప్పులు చెరిగింది. కోర్టుకెళతానని మీడియాకు వార్నింగ్ ఇచ్చింది.
తమ ప్యానెల్ సభ్యులు చెప్పాల్సిందంతా ప్రెస్ మీట్లో చెప్పేశారని, తాను చెప్పేది ఏమీ లేదని తెలిపింది. ఎన్నికల ఫలితాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు రాగానే గెలిచానని కొందరు కంగ్రాట్స్ చెప్పారని.. అంత వేగంగా బయటకు సమాచారం ఎలా వచ్చిందని ? ఆమె ప్రశ్నించింది. అలాగే రాత్రికి రాత్రే ఫలితాలు ఎలా తారుమారు అయ్యాయి ? అని ప్రశ్నలు వేసింది.
ఇక కొన్ని మీడియా చానల్స్, వెబ్సైట్స్, పత్రికలు తన గురించి అబద్దాలు రాస్తున్నాయని.. అలాంటి వాళ్లకు, సంస్థలకు వార్నింగ్ ఇస్తున్నానని.. నిజాలు రాయాలని.. తన ప్రమేయం లేకుండా తమ గురించి రాసినా.. తప్పుడు వార్తలను ప్రసారం చేసినా.. అలాంటి వారిపై కోర్టుకెళతానని అనసూయ హెచ్చరించింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…