Amazon Prime Video : యష్ హీరోగా కేజీఎఫ్కు సీక్వెల్ గా వచ్చిన మూవీ కేజీఎఫ్ 2. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను నమోదు చేస్తోంది. హిందీ మార్కెట్లో బాహుబలి 2 తరువాత అత్యధిక కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. అయితే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమ్ చేయాలని నిర్ణయించారు. అమెజాన్ ప్రైమ్ అందుకు గాను డిజిటల్ హక్కులను కూడా కొనుగోలు చేసింది. కానీ ప్రేక్షకులకు ఆ సంస్థ ఒక్కసారిగా షాకిచ్చింది. ఎందుకంటే ఓటీటీలో వస్తే సహజంగానే సినిమాను ఉచితంగానే చూస్తామన్న భావనలో ప్రేక్షకులు ఉన్నారు. కానీ ఓటీటీలో రిలీజ్ అయినపప్పటికీ ఈ మూవీని చూడాలంటే రూ.199 చెల్లించాలని అమెజాన్ ప్రైమ్ షరతు విధించింది. దీంతో అమెజాన్ ప్రైమ్ నిర్ణయంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఆ సంస్థను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
కేజీఎఫ్ 2 సినిమాను చూడాలంటే రూ.199 చెల్లించి పే పర్ వ్యూ పద్ధతిలో చూడాలని అమెజాన్ ప్రైమ్ షరతు పెట్టింది. అయితే ఇలాంటి మోడల్ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. భారత్లోనే కొత్త. దీంతో ఇప్పటికే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కోసం డబ్బులు చెల్లించాం కదా.. ఇప్పుడు ఈ కొత్త మెలిక ఏమిటి ? ఓటీటీలో సినిమా వస్తే ఉచితంగానే చూస్తున్నాం కదా.. ఇప్పుడు డబ్బులు చెల్లించాలని ఎందుకు అడుగుతున్నారు ? అంటూ ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూసేందుకు డబ్బులు చెల్లించాల్సి వస్తే.. అంత మాత్రానికి ఎంతో ధర పెట్టి అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ను తీసుకోవడం ఎందుకు ? ఇది కచ్చితంగా దోపిడీయే అని ఆ సంస్థపై ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో అమెజాన్ను ట్రోల్ చేస్తున్నారు.
ఇక పే పర్ వ్యూ పద్ధతిలో రూ.199 కి సినిమా అందుబాటులో ఉండడంతో కొందరు వెబ్సైట్ల నిర్వాహకులు ఈ మూవీని కాపీ చేసి ఆన్లైన్లో పెట్టేశారు. దీంతో ఎలాంటి రుసుము లేకుండానే ఈ మూవీ ఆన్లైన్లో ఉచితంగా పలు టోరెంట్ సైట్లలో లభిస్తోంది. ఈ క్రమంలోనే తాము రూ.199 చెల్లించకుండానే సినిమా హెచ్డీ ప్రింట్ను పొందుతున్నామని ప్రేక్షకులు అమెజాన్కు ట్వీట్ చేస్తున్నారు. ఇక కొందరు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ను వదులుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కేజీఎఫ్ 2 విషయంలో అమెజాన్ ప్రైమ్ కు సెగ తగిలిందనే చెప్పవచ్చు. మరి దీనిపై అమెజాన్ ప్రైమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…