Guava Leaves : మనకు సీజనల్గా లభించే అనేక రకాల పండ్లలో జామ పండ్లు కూడా ఒకటి. కొందరు వీటిని పచ్చిగా ఉండగానే తింటారు. అయితే ఇవి సాధారణంగా మనకు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. అందుకనే దీన్ని పేదవాడి ఆపిల్ అని పిలుస్తారు. ఇక జామకాయల వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వాటితోపాటు జామ ఆకులు కూడా మనకు అనేక లాభాలను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జామ పండ్లే కాదు, జామ ఆకులు కూడా డయాబెటిస్ను అదుపు చేస్తాయి. జామ ఆకులతో తయారు చేసిన టీని 19 మందికి నిత్యం ఇచ్చి సైంటిస్టులు పరిశోధనలు చేశారు. దీంతో ఆ టీ తాగిన వారిలో షుగర్ లెవల్స్ తగ్గాయని గుర్తించారు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు జామ ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే మంచిది. జామ ఆకులను తిన్నా, ఆ ఆకులతో తయారు చేసిన టీని తాగుతున్నా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) పెరుగుతుంది. సైంటిస్టులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించారు కూడా. దీని వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
మహిళలు రుతు సమయంలో జామ ఆకులను తీసుకోవడం వల్ల వారికి తీవ్రమైన నొప్పి సమస్య తగ్గుతుందని సైంటిస్టులు తేల్చారు. ఇందుకు గాను వారు 197 మందికి జామ ఆకుల నుంచి తీసిన పదార్థాలను నిత్యం 6 మిల్లీగ్రాముల మోతాదులో ఇచ్చారు. దీంతో రుతు సమయంలో వారికి చాలా వరకు నొప్పి సమస్య తగ్గిందని గుర్తించారు. జామ ఆకుల్లో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు జీర్ణాశయంలో సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. అలాగే డయేరియా సమస్య నుంచి బయట పడవచ్చు. విరేచనాలు అవుతున్న వారు జామ ఆకులను తింటే ప్రయోజనం ఉంటుంది.
జామ ఆకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఆ ఆకులను తింటే క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అలాగే వాటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ను నాశనం చేస్తాయి. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. జామ పండ్లే కాదు, జామ ఆకుల్లోనూ విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి బయట పడేస్తుంది. జామ ఆకులను సేకరించి పేస్ట్ రూపంలో వాటిని తయారు చేసుకుని ఆ మిశ్రమాన్ని చర్మంపై రాస్తే చర్మ సమస్యలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు తగ్గుతాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది. ఇలా జామ ఆకులతో అనేక లాభాలను పొందవచ్చు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…