Allu Arjun : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయి హీరో అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే.. అంతర్జాతీయంగా కూడా చాలా మంది బన్నీ ఫ్యాన్స్ గా మారిపోయారు. పుష్ప సినిమాలో ఆయన వేసిన శ్రీవల్లి స్టెప్ను అనుకరిస్తూ ఎంతో మంది ఇప్పటికే వీడియోలు చేశారు. తమ సరదాలు తీర్చుకున్నారు. పలు బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలు సైతం బన్నీ శ్రీవల్లి స్టెప్కు ఫిదా అయ్యారు. తీరికి దొరికినప్పుడల్లా ఆ స్టెప్ను వేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఇటీవలే వెకేషన్ నుంచి రాగా.. త్వరలోనే పుష్ప మూవీ రెండో పార్ట్లో నటించనున్నారు.
అయితే పుష్ప మూవీ రెండో పార్ట్ షూటింగ్ను ప్రారంభించే ముందు ప్రత్యేకంగా హోమం, పూజ చేయాలని అల్లు అర్జున్కు ఆయన స్నేహితులు సూచించారట. దీంతో అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ ఏర్పాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాకు వాస్తవానికి కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ మూవీ హిందీ విడుదలపై చిత్ర యూనిట్ అనేక సమస్యలను ఎదుర్కొంది. అలాగే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాలేదు. దీంతో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ దగ్గర ఉండి.. రోజుకు 18 నుంచి 20 గంటల పాటు సమయం కేటాయించి మరీ సినిమాను పూర్తి చేశారట. అందువల్ల అనుకున్న తేదీకి విడుదల చేశారు.
అయితే మొదటి పార్ట్ విడుదలకు ముందు తాము పడిన ఇబ్బందులు, వచ్చిన సమస్యలు, చేసిన హార్డ్ వర్క్.. రెండో పార్ట్కు ఉండకూడదని.. సినిమా షూటింగ్ సాఫీగా సాగిపోయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిలీజ్ అవ్వాలని కోరుతూ హోమం, పూజ చేయనున్నారట. అందుకోసమే అల్లు అర్జున్ ఆ పూజలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాతే పుష్ప 2 షూటింగ్ను ప్రారంభించనున్నారట.
ఇక పుష్ప 2ను మొదటి పార్ట్ కన్నా మరింత అద్భుతంగా తెరకెక్కించనున్నారని సమాచారం. మొదటి పార్ట్లో నటించిన స్టార్స్ చాలా మంది రెండో పార్ట్లోనూ నటించనున్నారు. కానీ రెండో పార్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక రెండో పార్ట్ను ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…