Allu Arjun : చిరంజీవి కుటుంబానికి, అల్లు ఫ్యామిలీకి మధ్య దూరం పెరుగుతుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ బలపరిచిన అభ్యర్థి ప్రకాష్ రాజ్ ప్రచారంలో అల్లు ఫ్యామిలీ పాల్గొనలేదు. కనీసం ఓటు వేసేందుకు కూడా రాలేదు. మరోవైపు అల్లు కుటుంబానికి చెందిన ఆహాతో నందమూరి ఫ్యామిలీ, అటు మంచు విష్ణు కుటుంబం దగ్గరవుతోంది. ఈ క్రమంలో తాజాగా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్తో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య దూరం మరింతగా పెరిగిందని అంటున్నారు.
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఓ వైపు అల్లు ఫ్యాన్స్ బన్నీని పొగుడుతుంటే.. మరో వైపు మెగాఫ్యాన్స్ మాత్రం అతన్ని విమర్శిస్తున్నారు. సదరు ప్రీ రిలీజ్ వేడుకలో ఫ్యాన్స్ కోరినట్లు బన్నీ జై పవర్ స్టార్ అనలేదు. కానీ జై బాలయ్య అన్నారు. ఇది మరింత మంది మెగా ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.
ఇక చిరంజీవి నటించిన తాజా చిత్ర ఆచార్యను డిసెంబర్ 17కు అటు, ఇటుగా విడుదల చేయాలని అనుకున్నారట. అప్పటికి పుష్ప రిలీజ్ డేట్లను అనౌన్స్ చేయలేదు. కానీ ఆచార్య విషయం తెలిసిన బన్నీ డిసెంబర్ 17న పుష్పను రిలీజ్ చేయాలని ప్రకటించేశాడట. దీంతో మెగాస్టార్ చిరంజీవికి కోపం వచ్చి ఆయన కూడా అదే తేదీన ఆచార్యను రిలీజ్ చేద్దామని అనుకున్నారట. కాకపోతే కోవిడ్ కారణంగా సంక్షోభంలో ఉన్న చిత్ర పరిశ్రమకు ఇబ్బందులు కలిగించడం ఎందుకని మెగాస్టార్ వెనక్కి తగ్గారట.
ఇక మొదట్లో చిరంజీవి పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చి ఆ పబ్లిసిటీ, గుర్తింపుతో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనే షాడో నుంచి బయట పడాలని చూస్తున్నాడట. అందుకనే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ కాస్త దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇది కేవలం తాత్కాలికమేనా.. ముందు ముందు ఈ విషయంలో ఏమైనా బయట పడతాయా ? అన్న విషయాలు వేచి చూస్తే తెలుస్తాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…