Manchu Lakshmi : మా ఎన్నికల గురించి కానీ.. అందులో పోటీ చేసిన నటుల గురించి కానీ.. అల్లు ఫ్యామిలీ.. ముఖ్యంగా అల్లు అర్జున్ ఎన్నడూ కామెంట్లు చేసింది లేదు. ఎన్నికల సమయంలో జరిగిన ప్రచారం.. తరువాత ఎన్నికలు.. అనంతరం ఏర్పడిన వివాదాలు.. వేటిపై కూడా అల్లు అర్జున్ స్పందించలేదు. అయితే తాజాగా ఆహా 2.0 ఈవెంట్లో మంచు లక్ష్మిని అల్లు అర్జున్ ప్రత్యేకంగా సంబోధించడం చర్చనీయాంశంగా మారింది.
మంచు లక్ష్మి ఇప్పటికే ఆహాతో భాగస్వామ్యం అయి ఓ కుకింగ్ షోను నిర్వహించిన విషయం విదితమే. మొన్నీ మధ్యే బాలయ్యకు చెందిన అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో అతిథిగా పాల్గొన్నారు. ఆమె ఇంగ్లిష్, తెలుగు కంబైన్డ్ యాస సినీ ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ బుల్లితెర ప్రేక్షకులు మాత్రం ఆమె మాట్లాడేవిధానాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇటీవలి కాలంలో పలు కార్యక్రమాలకు యాంకర్గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇక తాజాగా నిర్వహించిన ఆహా 2.0 ఈవెంట్కు కూడా మంచు లక్ష్మి యాంకర్గా వ్యవహరించారు. ఈ క్రమంలో ఓ సందర్భంలో అల్లు అర్జున్.. మంచు లక్ష్మిని ప్రెసిండ్ గారి అక్క.. అని సంబోంధించారు. ఇటీవల మంచు లక్ష్మి సోదరుడు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఆమెను ఆ విధంగా సంబోధించి ఆశ్చర్యపరిచారు.
అయితే వెంటనే స్పందించిన మంచు లక్ష్మి కూడా.. ప్రెసిడెంట్ అక్కడ అయితే ఏంటి.. ఎన్నో సమస్యలు, వివాదాలు దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి.. అని పేర్కొంది. దీంతో ఈవెంట్లో నవ్వుల పువ్వులు పూశాయి. కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ డిసెంబర్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ హిందీ రిలీజ్ విషయమై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడం కోసం బన్నీ స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…