Allu Arjun : గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ స్టైల్ కు, పూజా హెగ్డే అందాలకు, తమన్ స్వరాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచిందని చెప్పవచ్చు.
అల వైకుంఠపురం సినిమా ప్రమోషన్లో భాగంగా అప్పట్లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి అల్లు అర్జున్ తో సినిమా చేస్తానని చెప్పారు. అయితే తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుడు కావలెను సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు తమన్, అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత నాగవంశీ దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. త్వరలోనే సర్ప్రైజ్ ఉంది అంటూ హారిక హాసిని ట్విట్టర్ ను టాగ్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ మారడంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుందని తెలుస్తోంది. అయితే అల వైకుంఠపురములో సినిమా సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారా.. లేకపోతే సరికొత్త కథతో మరోసారి ప్రేక్షకులను సందడి చేయనున్నారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…