Alia Bhatt : సినీ సెలబ్రిటీలు అనేక సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుంటుంటారు. వారు ఏం చేసినా కొన్నిసార్లు వివాదాస్పదం అవుతుంటుంది. ఈ క్రమంలోనే వారు ప్రమోట్ చేసే బ్రాండ్లకు చెందిన ఉత్పత్తుల విషయంలోనూ ఇప్పటి వరకు చాలా మంది వివాదాల్లో ఇరుక్కున్నారు. తాజాగా నటి ఆలియాభట్ కూడా ఇలాగే వివాదంలో ఇరుక్కుపోయింది. గతంలో ఆమె చేసిన కామెంట్లను ఆసరాగా చేసుకుని కొందరు ఇప్పుడు ఆమెను తెగ ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
గతంలో ఆలియాభట్ ఒకసారి కపిల్ శర్మ షో అనే ఓ కామెడీ షోలో పాల్గొంది. అప్పట్లో ఆమె తాను అసలు చక్కెర తినను అని.. అది ఆరోగ్యానికి అత్యంత హానికరం అని కామెంట్ చేసింది. ఎవరూ చక్కెరను తినవద్దని.. అది అన్ని అనారోగ్య సమస్యలనే తెచ్చి పెడుతుందని ఆమె కామెంట్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె పలు కూల్ డ్రింక్స్కు చెందిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది. దీంతో నెటిజన్లకు చక్కని ఆయుధం దొరికినట్లు అయింది. ఆమె అన్న కామెంట్లనే సాక్ష్యాలుగా చూపిస్తూ వారు ఆమెను ఒక ఆట ఆడుకుంటున్నారు.
ఓ వైపు చక్కెర తినొద్దని చెప్పిన ఆలియా భట్.. చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ను ప్రమోట్ చేయడం ఎందుకని.. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చక్కెర స్లో పాయిజన్ అన్న ఆలియాభట్.. ప్రజలకు విషం తీసుకోమని ఎలా చెబుతుందని అడుగుతున్నారు. అంటే డబ్బులు ఇస్తే విషం తినాలని కూడా ప్రమోట్ చేస్తారా.. ప్రజల ఆరోగ్యం అంటే మీకు లెక్కలేదా.. అని కడిగి పారేస్తున్నారు. దీంతో ఆలియా భట్పై ప్రస్తుతం ట్రోల్స్, విమర్శలు ఎక్కువవుతున్నాయి.
కాగా ఆలియా భట్ ఇటీవలే గంగూబాయ కతియవాడి సినిమాతో పలకరించింది. అలాగే ఆర్ఆర్ఆర్ మూవీలోనూ సీత పాత్రలో అలరించింది. త్వరలో ఈమె కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ అనే చిత్రంలో నటించనుంది. ఇక తన భర్త రణబీర్ కపూర్తో కలిసి బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…