Alia Bhatt : సినీ సెలబ్రిటీలు అనేక సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుంటుంటారు. వారు ఏం చేసినా కొన్నిసార్లు వివాదాస్పదం అవుతుంటుంది. ఈ క్రమంలోనే వారు ప్రమోట్ చేసే బ్రాండ్లకు చెందిన ఉత్పత్తుల విషయంలోనూ ఇప్పటి వరకు చాలా మంది వివాదాల్లో ఇరుక్కున్నారు. తాజాగా నటి ఆలియాభట్ కూడా ఇలాగే వివాదంలో ఇరుక్కుపోయింది. గతంలో ఆమె చేసిన కామెంట్లను ఆసరాగా చేసుకుని కొందరు ఇప్పుడు ఆమెను తెగ ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
గతంలో ఆలియాభట్ ఒకసారి కపిల్ శర్మ షో అనే ఓ కామెడీ షోలో పాల్గొంది. అప్పట్లో ఆమె తాను అసలు చక్కెర తినను అని.. అది ఆరోగ్యానికి అత్యంత హానికరం అని కామెంట్ చేసింది. ఎవరూ చక్కెరను తినవద్దని.. అది అన్ని అనారోగ్య సమస్యలనే తెచ్చి పెడుతుందని ఆమె కామెంట్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె పలు కూల్ డ్రింక్స్కు చెందిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది. దీంతో నెటిజన్లకు చక్కని ఆయుధం దొరికినట్లు అయింది. ఆమె అన్న కామెంట్లనే సాక్ష్యాలుగా చూపిస్తూ వారు ఆమెను ఒక ఆట ఆడుకుంటున్నారు.
ఓ వైపు చక్కెర తినొద్దని చెప్పిన ఆలియా భట్.. చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ను ప్రమోట్ చేయడం ఎందుకని.. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చక్కెర స్లో పాయిజన్ అన్న ఆలియాభట్.. ప్రజలకు విషం తీసుకోమని ఎలా చెబుతుందని అడుగుతున్నారు. అంటే డబ్బులు ఇస్తే విషం తినాలని కూడా ప్రమోట్ చేస్తారా.. ప్రజల ఆరోగ్యం అంటే మీకు లెక్కలేదా.. అని కడిగి పారేస్తున్నారు. దీంతో ఆలియా భట్పై ప్రస్తుతం ట్రోల్స్, విమర్శలు ఎక్కువవుతున్నాయి.
కాగా ఆలియా భట్ ఇటీవలే గంగూబాయ కతియవాడి సినిమాతో పలకరించింది. అలాగే ఆర్ఆర్ఆర్ మూవీలోనూ సీత పాత్రలో అలరించింది. త్వరలో ఈమె కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ అనే చిత్రంలో నటించనుంది. ఇక తన భర్త రణబీర్ కపూర్తో కలిసి బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…