OTT : ప్రతి వారం వచ్చిందంటే చాలు.. ఓటీటీల్లో కొత్త మూవీలు ఏవి విడుదల అవుతాయా.. అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో కన్నా ఓటీటీల్లో మూవీలను చూసే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. అందులో భాగంగానే మేకర్స్ కూడా కాస్త ఎక్కువ రుసుము తీసుకుని మరీ తమ సినిమాలను ముందుగానే ఓటీటీల్లోకి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీల్లో విడుదల కానున్నాయి. అవి ప్రేక్షకులను అలరించే సినిమాలు కావడం విశేషం. ఇక ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమ్ కానున్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ స్టార్ హీరో విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డె నటించిన బీస్ట్ మూవీ ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమ్ కానుంది. మే 11న సన్ నెక్ట్స్తోపాటు నెట్ఫ్లిక్స్లో ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేదు. ఓ దశలో విజయ్ ఫ్యాన్స్ చెన్నైలో ఓ థియేటర్లో తెరను తగులబెట్టారు. దీంతో సినిమాకు ఏవిధమైన నెగెటివిటీ వచ్చిందో అర్థమైంది. అయితే ఓటీటీలో అయినా ఈ మూవీ అలరిస్తుందో.. లేదో.. చూడాలి.
ఇక దేశ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఎట్టకేలకు ఓటీటీల్లోకి రానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన ఈ మూవీ కోట్ల రూపాయలను వసూలు చేసి అందరికీ షాకిచ్చింది. ఈ మూవీని జీ5 ప్లాట్ఫామ్పై స్ట్రీమ్ చేయనున్నారు. మే 13వ తేదీన ఈ యాప్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
అలాగే ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు బుక్ మై షో, గూగుల్ ప్లే మూవీస్లో స్ట్రీమ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాను చూడాలంటే పే పర్ వ్యూ పద్ధతిలో డబ్బులు చెల్లించాలి. ఈ సినిమా తెలుగు, హిందీలోనూ అందుబాటులోకి రానుంది.
ది సావేజ్ బ్యూటీ అనే ఇంగ్లిష్ డ్రామా మూవీని సైతం ఈ వారమే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. నెట్ఫ్లిక్స్ లో మే 12వ తేదీ నుంచి ఈ మూవీని చూడవచ్చు.
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…