Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కానుండగా.. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ను వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం చిత్ర యూనిట్ మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇక లేటెస్ట్గా మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మహేష్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే సినిమాలో కొన్ని సీన్లు మాత్రం అద్భుతంగా ఉంటాయని ఆయన చెప్పారు. దీంతో ఆయన కామెంట్స్పై ఇంట్రెస్ట్ పెరిగింది.
ఈ మూవీలో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే తనకు, వెన్నెల కిషోర్ కు మధ్య నడిచే కామెడీ ట్రాక్ అద్భుతంగా ఉంటుందని.. తమ మధ్య వచ్చే కామెడీ సీన్లకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయమని.. మహేష్ అన్నారు. చూస్తుంటే గతంలో వీరు కలిసి నటించిన దూకుడు సినిమాలోని సీన్లు ఈ మూవీలోనూ రిపీట్ అవుతాయని తెలుస్తోంది. ట్రైలర్లోనూ వెన్నెల కిషోర్ కామెడీ ఏంటో చూపించారు. ముఖ్యంగా ఒక సీన్ లో ఆయన.. ఊరుకోండి సార్.. ఇప్పుడే మీకు పెళ్లి ఏంటి, మీరు ఇంకా చిన్న పిల్లాడు అయితేనూ.. అని అంటారు. దీనికి మహేష్ జవాబు చెబుతూ.. ఊరుకోండి.. అందరూ అలాగే అంటున్నారు. మెయింటెయిన్ చేయలేక దూలతీరిపోతోంది.. అంటూ కీరదోస ముక్కలను మహేష్ కళ్లపై పెట్టుకుంటారు. ముఖ్యంగా ట్రైలర్ ఈ సీన్ అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఇలాంటి సీన్లు ఈ సినిమాలో చాలానే ఉన్నాయని మహేష్ చెప్పడం విశేషం.
ఇక వెన్నెల కిషోర్కు తనకు మధ్య నడిచే ట్రాక్, ఆయా సందర్భాల్లో వచ్చే సీన్లకు చెందిన బ్లాక్స్ అద్భుతంగా ఉంటాయని మహేష్ చెప్పారు. కాగా ఈ సినిమాలో మహేష్కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. దీనికి థమన్ సంగీతం అందించారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు అన్నీ బాగున్నాయని ఇప్పటికే ప్రేక్షకులు వెల్డన్ చెప్పేశారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…