Ira Khan : బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ఖాన్ కానీ.. ఆయన కుమార్తె ఇరా ఖాన్ కానీ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. అమీర్ఖాన్ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. అయితే ఆయన కొన్నిసార్లు చేసే వ్యాఖ్యలు.. చేసే పనులు వివాదాస్పదం అవుతుంటాయి. అలాగే ఆయన కుమార్తెను కూడా నెటిజన్లు ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఇరా ఖాన్ మరోమారు విమర్శల పాలవుతోంది. తన బర్త్ డే సందర్భంగా ఆమె బికినీ ధరించి తండ్రి అమీర్ఖాన్ పక్కనే ఉండి కేక్ కట్ చేసింది. అయితే అంతా బాగానే ఉంది. కానీ ఆమె అలా బికినీ ధరించడంపైనే నెటిజన్లు ఫైరవుతున్నారు.
ఆదివారం ఇరాఖాన్ తన 25వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంది. చూస్తుంటే ఏదో రిసార్ట్లోనో.. హోటల్లోనూ అమీర్ఖాన్ కుటుంబం మొత్తం ఉన్నట్లు ఫొటోలను చూస్తే అర్థమవుతుంది. అక్కడే ఇరాఖాన్ వెంటే బాయ్ ఫ్రెండ్ నుపుర్ శిఖరే, సోదరుడు ఆజాద్ రావ్ ఖాన్లు కూడా ఉన్నారు. అయితే ఆమె బర్త్ డే వేడుక సందర్భంగా కేక్ కూడా కట్ చేసింది. అందరూ స్విమ్మింగ్ పూల్లో సరదాగా గడుపుతూ ఈ వేడుకలో పాల్గొనట్లు అర్థమవుతోంది. అయితే ఇరాఖాన్ మాత్రం బికినీలో అందాలను ప్రదర్శిస్తూ కనిపించింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకు సిగ్గులేదా.. కనీసం మంచి బట్టలు అయినా వేసుకోవచ్చు కదా.. అంటూ విమర్శిస్తున్నారు.
అయితే ఇరాఖాన్ ఇటీవల రంజాన్ సందర్భంగా కూడా ఓ డ్రెస్ ధరించగా.. అది కూడా గ్లామర్గానే ఉంది. దీంతో ఆమెను అప్పుడు ట్రోల్ చేశారు. అది జరిగి కనీసం వారం కూడా కాకముందే మళ్లీ ఆమె ఇలా కనిపించడంతో మరోమారు నెటిజన్లు తమదైన శైలిలో ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇక ఇరాఖాన్ తనకు మానసిక వ్యాధి ఉందని.. సడెన్గా ఆందోళనకు గురవుతానని.. గతంలో ఎన్నోసార్లు చెప్పింది. కాగా అమీర్ఖాన్ ఇటీవలే తన భార్య కిరణ్ రావ్కు విడాకులు ఇచ్చిన విషయం విదితమే. ఆయన ఇంకో హీరోయిన్తో రిలేషన్షిప్ లో ఉన్నారని.. అందుకనే విడాకులు ఇచ్చి ఉంటారని బీటౌన్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అమీర్ఖాన్ త్వరలో లాల్ సింగ్ చడ్డా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…