Akhil Akkineni : అక్కినేని మూడో తరం హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ హిట్తో మంచి జోష్లో ఉన్నాడు. అందమైన ప్రేమ కథతోపాటు చక్కటి ఎమోషన్స్ తో సాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో మొదటి హిట్ను అందుకున్నాడు అఖిల్. ఇప్పుడు ఇదే జోష్తో తన నెక్స్ట్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్గా ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో అఖిల్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తారని తెలుస్తోంది. అఖిల్కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాక్షి వైద్య నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మరో హీరోయిన్గా తమిళ యువ నటి అతుల్య రవిని ఎంపిక చేశారు. సాక్షికి ఇది తొలి చిత్రం కాగా, అతుల్య ఇంతకుముందు కాదల్ కన్ కట్టుదే, యెమాలి, అడుత సత్తై, నాడోడిగల్ 2 వంటి తమిళ చిత్రాలలో కనిపించింది.
ఇద్దరు హీరోయిన్స్లో ఎవరు మొదటి హీరోయిన్, రెండో హీరోయిన్గా ఎవరు నటిస్తారు ? అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.
మమ్ముట్టిపై బుడాపెస్ట్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మమ్ముట్టి ఆర్మీ ఆఫీసర్ గా అఖిల్ కి ఓ మెంటార్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చేఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…