Akhil Akkineni : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ సక్సెస్ అనంతరం అక్కినేని అఖిల్ చాలా జోరు మీద ఉన్నాడు. చాలా రోజుల తరువాత ఒక మూవీ హిట్ కావడంతో అఖిల్ ఆ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఏజెంట్ సినిమాకు చెందిన పలు ముఖ్యమైన సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. అందులో బాగంగానే ఈ మూవీ షూటింగ్ను మనాలి పరిసరాల్లో కొనసాగిస్తున్నారు. అయితే ఈ మూవీలోంచి అఖిల్కు చెందిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అందులో అఖిల్ హాలీవుడ్ హీరోలా కనిపిస్తుండడం విశేషం.
అఖిల్కు చెందిన ఈ ఫొటోలో అఖిల్ డబుల్ జాకెట్ ధరించి ఉన్నాడు. మంచు కొండల్లో పోరాటాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రింగుల జుట్టుతో వెనుక చిన్నపాటి పోనీ టెయిల్ జుట్టును పెట్టుకుని అఖిల్ చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. ఈ ఫొటోలో అఖిల్ను చూస్తుంటే హాలీవుడ్ హీరో కిట్ హారింగ్టన్ గుర్తుకు వస్తున్నాడని అఖిల్ ఫ్యాన్స్ అంటున్నారు. కిట్ హారింగ్టన్ ప్రముఖ టీవీ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ద్వారా పాపులర్ అయ్యాడు. అందులో ఆయన జాన్ స్నో అనే పాత్రలో అలరించారు. అందులో జాన్ స్నో పాత్రలో కూడా రింగుల జుట్టుతో కనిపిస్తాడు. అలాగే కిట్కు అఖిల్కు ముఖంలో పోలికలు కూడా ఒకేలా ఉన్నాయి. దీంతో కిట్ హారింగ్టన్తో అఖిల్ను పోలుస్తున్నారు. అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నావని అఖిల్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
ఇక అఖిల్ ఏజెంట్ మూవీలో మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది. ఈమెకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. ఆగస్టు 12వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. గూఢచారి నేపథ్యంలో సినిమా కథ సాగుతుందని ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ను చూస్తే తెలుస్తోంది. దీంతో అఖిల్ సీక్రెట్ ఏజెంట్గా ఎలా కనిపిస్తాడోనని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…