Radhika Apte : రక్త చరిత్ర మొదటి పార్ట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ.. రాధికా ఆప్టే. ఆ తరువాత ఈమెకు తెలుగులో పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. వాటిల్లో లెజెండ్ మూవీ ఒకటి. ఇది హిట్ అయినప్పటికీ రాధికా ఆప్టేకు మళ్లీ ఆఫర్లు రాలేదు. అయినప్పటికీ ఈమె మరాఠీ, బెంగాలీ, హిందీ భాషలకు చెందిన సినిమాల్లో నటిస్తూ వస్తోంది. అయితే గతంలో ఓ చిత్రంలో బోల్డ్ సీన్లలో నటించిన ఈ బ్యూటీ సంచలనం సృష్టించింది. ఆ తరువాత ఈమెకు పెద్దగా ఆఫర్లు కూడా రావడం లేదు. అయినప్పటికీ రాధికా ఆప్టే తనకు వచ్చిన ఆఫర్లను కాదనకుండా చేస్తోంది.
ఇక రాధికా ఆప్టే సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్గా ఉండదు. ఈమె గ్లామర్ షో కేవలం సినిమాలకే పరిమితం. ఇతర హీరోయిన్లలా సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేయదు. కానీ ఫాలోవర్లు మాత్రం ఎక్కువగానే ఉన్నారు. ఇక రాధికా ఆప్టే తాజాగా సర్జరీలు చేయించుకునే హీరోయిన్లపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొందరు సర్జరీలు వద్దు అంటూనే చేయించుకుంటారని.. సహజసిద్ధమైన అందం అంటే వారికి నచ్చదని రాధికా కామెంట్స్ చేసింది.
కొందరు హీరోయిన్లు తమ శరీరంలో భాగాలను అందంగా కనిపించాలని సర్జరీలు చేయించుకుంటారని.. కానీ అలా చేయడం తన వల్ల కాదని రాధికా ఆప్టే పేర్కొంది. అలాంటి వారిని చూడాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుందని కామెంట్స్ చేసింది. అయితే శరీరానికి సర్జరీలు చేయించుకునేవారు చెప్పే మాటలను విని విసిగిపోయానని కూడా ఆమె తెలియజేసింది. కాగా రాధికా ఆప్టే ప్రస్తుతం విక్రమ్ వేదా అనే సినిమాలో నటిస్తుండగా ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అలాగే ఈమె నటించిన ఫోరెన్సిక్ అనే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇక నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న మోనికా, ఓ మై డార్లింగ్ అనే మూవీలోనూ ఈమె నటిస్తోంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…