Airtel 5G : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 5జి సేవలను ప్రారంభించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలు ముందుగా పలు ఎంపిక చేసిన నగరాల్లో 5జి సేవలను అందిస్తామని ప్రకటించాయి. ఇక జియో 4 నగరాల్లో 5జి సేవలను ప్రారంభించగా.. ఎయిర్టెల్ తాజాగా 8 నగరాల్లో 5జి సేవలను ప్రారంభించినట్లు తెలియజేసింది. ఈ మేరకు ఎయిర్టెల్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
ఎయిర్టెల్ 5జి సేవలు 8 నగరాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్పూర్, వారణాసి ప్రాంతాల్లో 5జి సేవలను ప్రారంభించామని ఎయిర్టెల్ ప్రతినిధులు తెలియజేశారు. ఇక త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలకు తమ 5జి సేవలను విస్తరిస్తామని ఎయిర్ టెల్ తెలియజేసింది. అయితే 5జి సేవలను పొందాలంటే ప్రస్తుతం ఉన్న 4జి సిమ్లను మార్చాల్సిన పనిలేదని.. 5జి టెక్నాలజీని ఇప్పటికే ప్రస్తుతం ఉన్న సిమ్లు కలిగి ఉన్నాయని.. కనుక సిమ్ మార్చకుండానే వినియోగదారులు 5జి సేవలను పొందవచ్చని ఎయిర్టెల్ తెలియజేసింది.
అయితే 5జి సేవలను పొందాలంటే.. వినియోగదారులు 5జిని సపోర్ట్ చేసే ఫోన్ను కలిగి ఉండాలి. ఇక హైదరాబాద్లో ఉన్న ఎయిర్టెల్ వినియోగదారులు ప్రస్తుతం తమ 5జి ఫోన్లలో 5జి సేవలను పొందవచ్చు. కాగా ఈ ఏడాది చివరి వరకు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 5జి ని అందిస్తామని, వచ్చే ఏడాది మార్చి వరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ 5జి సేవలు లభిస్తాయని.. ఎయిర్టెల్ ప్రతినిధులు తెలియజేశారు. ఇక 5జి టెక్నాలజీ వల్ల ప్రస్తుతం వాడుతున్న 4జి కన్నా వినియోగదారులు 20 నుంచి 30 రెట్లు ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ను పొందవచ్చు. దీంతో పనులను వేగంగా చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…