Airtel 5G : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 5జి సేవలను ప్రారంభించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలు ముందుగా పలు ఎంపిక చేసిన నగరాల్లో 5జి సేవలను అందిస్తామని ప్రకటించాయి. ఇక జియో 4 నగరాల్లో 5జి సేవలను ప్రారంభించగా.. ఎయిర్టెల్ తాజాగా 8 నగరాల్లో 5జి సేవలను ప్రారంభించినట్లు తెలియజేసింది. ఈ మేరకు ఎయిర్టెల్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
ఎయిర్టెల్ 5జి సేవలు 8 నగరాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్పూర్, వారణాసి ప్రాంతాల్లో 5జి సేవలను ప్రారంభించామని ఎయిర్టెల్ ప్రతినిధులు తెలియజేశారు. ఇక త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలకు తమ 5జి సేవలను విస్తరిస్తామని ఎయిర్ టెల్ తెలియజేసింది. అయితే 5జి సేవలను పొందాలంటే ప్రస్తుతం ఉన్న 4జి సిమ్లను మార్చాల్సిన పనిలేదని.. 5జి టెక్నాలజీని ఇప్పటికే ప్రస్తుతం ఉన్న సిమ్లు కలిగి ఉన్నాయని.. కనుక సిమ్ మార్చకుండానే వినియోగదారులు 5జి సేవలను పొందవచ్చని ఎయిర్టెల్ తెలియజేసింది.
అయితే 5జి సేవలను పొందాలంటే.. వినియోగదారులు 5జిని సపోర్ట్ చేసే ఫోన్ను కలిగి ఉండాలి. ఇక హైదరాబాద్లో ఉన్న ఎయిర్టెల్ వినియోగదారులు ప్రస్తుతం తమ 5జి ఫోన్లలో 5జి సేవలను పొందవచ్చు. కాగా ఈ ఏడాది చివరి వరకు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 5జి ని అందిస్తామని, వచ్చే ఏడాది మార్చి వరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ 5జి సేవలు లభిస్తాయని.. ఎయిర్టెల్ ప్రతినిధులు తెలియజేశారు. ఇక 5జి టెక్నాలజీ వల్ల ప్రస్తుతం వాడుతున్న 4జి కన్నా వినియోగదారులు 20 నుంచి 30 రెట్లు ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ను పొందవచ్చు. దీంతో పనులను వేగంగా చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…