Airtel 5G : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 5జి సేవలను ప్రారంభించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలు ముందుగా పలు ఎంపిక చేసిన నగరాల్లో 5జి సేవలను అందిస్తామని ప్రకటించాయి. ఇక జియో 4 నగరాల్లో 5జి సేవలను ప్రారంభించగా.. ఎయిర్టెల్ తాజాగా 8 నగరాల్లో 5జి సేవలను ప్రారంభించినట్లు తెలియజేసింది. ఈ మేరకు ఎయిర్టెల్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
ఎయిర్టెల్ 5జి సేవలు 8 నగరాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్పూర్, వారణాసి ప్రాంతాల్లో 5జి సేవలను ప్రారంభించామని ఎయిర్టెల్ ప్రతినిధులు తెలియజేశారు. ఇక త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలకు తమ 5జి సేవలను విస్తరిస్తామని ఎయిర్ టెల్ తెలియజేసింది. అయితే 5జి సేవలను పొందాలంటే ప్రస్తుతం ఉన్న 4జి సిమ్లను మార్చాల్సిన పనిలేదని.. 5జి టెక్నాలజీని ఇప్పటికే ప్రస్తుతం ఉన్న సిమ్లు కలిగి ఉన్నాయని.. కనుక సిమ్ మార్చకుండానే వినియోగదారులు 5జి సేవలను పొందవచ్చని ఎయిర్టెల్ తెలియజేసింది.
అయితే 5జి సేవలను పొందాలంటే.. వినియోగదారులు 5జిని సపోర్ట్ చేసే ఫోన్ను కలిగి ఉండాలి. ఇక హైదరాబాద్లో ఉన్న ఎయిర్టెల్ వినియోగదారులు ప్రస్తుతం తమ 5జి ఫోన్లలో 5జి సేవలను పొందవచ్చు. కాగా ఈ ఏడాది చివరి వరకు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 5జి ని అందిస్తామని, వచ్చే ఏడాది మార్చి వరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ 5జి సేవలు లభిస్తాయని.. ఎయిర్టెల్ ప్రతినిధులు తెలియజేశారు. ఇక 5జి టెక్నాలజీ వల్ల ప్రస్తుతం వాడుతున్న 4జి కన్నా వినియోగదారులు 20 నుంచి 30 రెట్లు ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ను పొందవచ్చు. దీంతో పనులను వేగంగా చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…