Aha Balakrishna : నందమూరి బాలకృష్ణ ఆహా యాప్లో రానున్న ఓ టాక్షోకు వ్యాఖ్యాతగా మారారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ టాక్ షోను ఆయన లాంచ్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ముందు ఆయనను మంచు మోహన్ బాబు, విష్ణులు కలిశారు. తన కుమారుడికి సపోర్ట్ ఇచ్చినందుకు మోహన్ బాబు.. బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. తరువాత బాలకృష్ణ టాక్ షోను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆహా కోసం ఈ షో చేయడం ఆనందంగా ఉందన్నారు. అనేక జాతీయ, అంతర్జాయతీయ ఓటీటీలకు దీటుగా ఆహా కూడా ఎదగాలని అన్నారు. అల్లు అరవింద్ సారథ్యంలోని ఆహాలో బాలకృష్ణ టాక్ షో అనడంతో.. ఈ షోపై ఉన్న ఆసక్తి ఇంకా పెరిగింది. ఇక ఈ షో లాంచ్ సందర్భంగా అనేక విషయాలపై బాలకృష్ణ మాట్లాడారు.
సినీ ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా సరే పోటీ ఉంటుందన్నారు. పోటీ ఉండాలని.. అలాంటప్పుడే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. అయితే అది కేవలం సినిమాలకు, రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలని బాలకృష్ణ అన్నారు. బావిలో కప్పల మాదిరిగా అక్కడే ఉండిపోవద్దని సూచించారు. కాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఆయన ‘మా’ వివాదం నేపథ్యంలోనే ఈ విధంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. అయితే ‘మా’ లో నెలకొన్న వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…