Adivi Sesh Major Movie : కరోనా నేపథ్యంలో అనేక పెద్ద చిత్రాలు ఇప్పటికే వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేకర్స్ అందరూ తమ చిత్రాలకు కొత్త రిలీజ్ డేట్స్ను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలకు విడుదల తేదీలను అనౌన్స్ చేశారు. ఇక తాజాగా అడివి శేష్ నటించిన మేజర్ చిత్రం కూడా వాయిదా పడగా.. ఈ చిత్రానికి కూడా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ మే27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
వాస్తవానికి మేజర్ సినిమా ఈ మూమెంట్లో రిలీజ్ కావల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు. అయితే ఆశ్చర్యకరంగా సినిమా విడుదల తేదీని చాలా రోజుల వ్యవధితో ప్రకటించారు. అప్పటి వరకు చాలా సమయం ఉంది. అన్ని రోజుల గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కాని విషయం. ఈ మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ చాలా గ్యాప్ తీసుకుని ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ మేజర్ మూవీని తెరకెక్కించారు. దీనికి శశి కిరణ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు హిందీ, మళయాళం భాషల్లోనూ ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో అడివి శేష్కు అపోజిట్గా సాయి మంజ్రేకర్ కీలకపాత్రలో నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో శోభిత ధూళిపాళ నటించింది.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…