Adipurush Movie : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ.. ఆది పురుష్. ఈ చిత్రం వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ మూవీని వచ్చే ఏడాది.. అంటే.. 2023 జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రభాస్ బాహుబలి తరువాత చేసిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో.. కనీసం ఆదిపురుష్తోనైనా హిట్ కొడతాడని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 2న అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆది పురుష్ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించారని ముందు నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం. క్యారెక్టర్లను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ యానిమేటెడ్ మూవీ అని టీజర్ చూసిన తరువాత తెలిసింది. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఇది మోషన్ గ్రాఫిక్స్ ఆధారంగా తెరకెక్కిన మూవీ. రియల్ మూవీ అని అందరూ అనుకున్నారు. కానీ యానిమేటెడ్ మూవీ కావడంతో మూవీపై జోక్స్ పేలుతున్నాయి. సోషల్ మీడియాలో అనేక మీమ్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఆది పురుష్ చిన్న పిల్లల సినిమా అని.. పిల్లల్ని సినిమాకు తీసుకెళ్తున్నట్లుగా ఉండే మీమ్స్ను బాగా షేర్ చేస్తున్నారు. అలాగే వానర సైన్యంతో చేసిన గ్రాఫిక్స్ అచ్చం హాలీవుడ్ మూవీ కాంగ్ను తలపిస్తున్నాయని అంటున్నారు. ఇక కొందరైతే ఈ మూవీని వీడియో గేమ్గా అభివర్ణిస్తున్నారు. ఇది రిలీజ్ అయితే సంతోషం అని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎంతో కాలంగా ఈ మూవీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు మాత్రం నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. గ్రాఫిక్స్ బాగానే ఉన్నా.. యానిమేటెడ్ సినిమా కావడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు.. సినిమా ప్రేక్షకులకు కూడా ఈ మూవీ నచ్చడం లేదు. ఇక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శనను ఇస్తుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…