Adipurush : బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. రామాయణం కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 70 రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్టు సమాచారం.
నవంబర్ నెల ఆఖరులోగా ఈ చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఆ తరువాత ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ వాడటం వల్ల ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే ఎక్కువ సమయం తీసుకుండడం వల్ల ఈ చిత్రాన్ని నవంబర్ లోగా పూర్తి చేయాలని దర్శకుడు ఓం రౌత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో కృతిసనన్ సందడి చేయనున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం 2022 ఆగస్టు 11వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…