Adi Purush : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ కు జోడీగా సీతమ్మ పాత్రలో తన షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసుకున్న సందర్భంలో తన టీమ్ తో కలిసి కృతి సనన్ కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా రాముడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా పౌరాణిక మాగ్నమ్ ఓపస్ లో తెరకెక్కిస్తుండగా.. కృతి సనన్ సీతాదేవిగా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ డెమోన్ కింగ్ లంకేష్ గా అంటే రావణాసురుడిగా నటిస్తున్నారు.
సన్నీ సింగ్ ఈ మూవీలో లక్ష్మణుడి పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…