Actress Hema : ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సత్తా చాటిన హేమ అప్పుడప్పుడూ వివాదాలతో వార్తలలో నిలుస్తూ ఉంటోంది. ఇటీవల బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఇందులో సుమారు 150 మంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు పట్టుబడడంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు వేగవంతమయ్యాయనే చర్చకు తెరలేచింది. అయితే నటి హేమ పేరు కూడా తెరపైకి రావడం తీవ్ర దుమారం రేపింది. అసలు పబ్కే వెళ్లని తనపేరును ఏ విధంగా ప్రచారంలోకి తెస్తారంటూ ఆమె ఆవేశంతో మీడియా ప్రతినిధులను నిలదీసింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న చానళ్లపై ఫిర్యాదు చేసేందుకు ఆమె బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వెళ్లారు.
అసలు తాను అసలు పబ్కు వెళ్లలేదన్నారు. అలాంటప్పుడు తన పేరును డ్రగ్స్ కేసులో ఎలా ఇరికిస్తారని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదన్నారు. తనకు కూతురు, కుటుంబం ఉందని, సంబంధం లేని విషయంలో దుష్ప్రచారం చేయడం ద్వారా ఎంతగా ఆవేదన చెందాల్సి వస్తుందో అర్థం చేసుకోవాలని కోరారు. కొందరు కావాలనే తన పేరును ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హేమ. అయితే ఒక ప్రముఖ టీవీ ఛానెల్లో తన పేరు స్క్రోలింగ్ను చూసినప్పుడు ఓ జర్నలిస్ట్ని పిలిచానని హేమ చెప్పుకొచ్చింది.
సీనియర్ మోస్ట్ క్రైమ్ రిపోర్టర్ గా పేరున్న ఓ జర్నలిస్టును పోలీస్ స్టేషన్కు పిలిపించానని.. డ్రగ్స్ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు అతనికి ఎలా తెలిసింది.. ఎవరు చెప్పారు.. వంటి వివరాలపై క్లారిటీ ఇచ్చేందుకు స్టేషన్కు రమ్మని పిలిచానని.. అయితే అతను రాలేదని.. పారిపోయాడని.. హేమ తెలిపారు. చూస్తుంటే తనను కేవలం అన్పాపులర్ చేసేందుకే ఇలా కొందరు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుందని అన్నారు. కేవలం టీఆర్పీ కోసమే ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని నటి హేమ అడిగారు. అయితే ఇది నటి హేమ వెర్షన్ అని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంత ఉంది.. అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…