Acharya Movie On OTT : భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆచార్య. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత చిరంజీవి ఆచార్యతో ప్రేక్షకులని పలకరించారు. ఇందులో రామ్ చరణ్ మరో ముఖ్య పాత్రలో నటించడం విశేషం. భారీ అంచనాలు నడుమ నేడు థియేటర్స్లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. మూవీకి మిశ్రమ స్పందన లభిస్తున్న నేపథ్యంలో చాలా మంది మెగా అభిమానులు నీరసించిపోయారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఓ వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా ఆచార్య మూవీ తొలి వారం హౌజ్ఫుల్తో దూసుకుపోతుందని విశ్వసిస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో సినిమాలు విడులైన కొద్ది రోజులకే ఓటీటీలోకి వస్తుండగా, ఆచార్య మూవీ కూడా త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. థియేటర్లో విడులైన మూడు వారాల అనంతరం ఆచార్య ఓటీటీలోకి రానుందని సమాచారం.
అంటే మే చివరి వారం నుంచి ఆచార్య ఆమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇందులో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటించగా ఆయనకు జోడిగా పూజా హెగ్డె నటించింది. చిరు సరసన కాజల్ ని ఎంపిక చేసి ఆ తర్వాత తప్పించారు. ఆచార్య కోసం 20 ఎకరాల్లో భారీ టెంపుల్ సెట్ వేసిన విషయం తెలిసిందే. దానికి ధర్మస్థలి అని నామకరణం చేశారు. సినిమాలోని సింహభాగం ఇక్కడే షూటింగ్ చేశారు. మణిశర్మ మ్యూజిక్ సినిమాకి పెద్దగా ఉపయోగపడలేదు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…