Manchu Vishnu : ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. రెండు ఫ్యామిలీల మధ్య వివాదం ఇప్పటిది కాదు. టాలీవుడ్ వజ్రోత్సవ వేడుకల సమయంలో అవార్డుల విషయమై గొడవ జరిగింది. చిరంజీవికి లెజెండరీ పురస్కారం ఇచ్చి, మోహన్ బాబుకు ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్, మోహన్ బాబు మధ్య వార్ నడిచింది. ఇక అది జరిగి ఏళ్లు కాగా మధ్యలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో మంచు ఫ్యామిలీ సన్నిహితంగానే ఉంది.
ఇటీవల జరిగిన మా ఎన్నికలు రెండు కుటుంబాల మధ్య మళ్లీ అగ్గిని రాజేశాయి. మెగా ఫ్యామిలీ మంచు విష్ణు ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేయడంతో అగ్గి రాజుకుంది. మంచు విష్ణు ఓ సందర్భంలో చిరంజీవి అంకుల్ నన్ను ఎన్నికల నుండి తప్పుకోమన్నారంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. ఇక ఈ ఎన్నికల సమయంలో నాగబాబు, మంచు విష్ణు, మోహన్ బాబుల మధ్య జరిగిన మాటల యుద్ధం పీక్స్ కి వెళ్లిన విషయం తెలిసిందే. నాగబాబు ఇటీవల మోహన్ బాబు సినిమాను ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. తన అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్న ఆయన కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది అని అడిగారు. దానికి నాగబాబు రెండూ కాదు ఓ లెజెండరీ గ్రాఫిక్స్ మూవీ.. అంటూ సమాధానం చెప్పారు.
సమయం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు వదులుతున్నారు. అయితే తాజాగా విడుదలైన ఆచార్య చిత్రం తొలి షో నుండే డివైడ్ టాక్తో నడుస్తున్న క్రమంలో మంచు విష్ణు ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంచు విష్ణు తన ట్వీట్లో రాస్తూ.. డాన్స్ రిహార్సల్స్ మొదలయ్యాయి. దీంతో ఒళ్ళంతా నొప్పులు.. అంటూ విష్ణు ట్వీట్ చేశారు. మంచు విష్ణు ట్వీట్ చేసే సమయానికి యూఎస్ ప్రీమియర్స్ నుంచి ఆచార్య చిత్రానికి టాక్ మొదలైపోయింది. టాక్ ఆశించిన విధంగా లేదు. మిశ్రమ స్పందన వస్తోంది.. అనే సరికి మంచు విష్ణు దానిపై ఇలా సెటైరికల్ ట్వీట్ చేశారని కొందరు అనుకుంటున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు గాలి నాగేశ్వర రావు అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో డాన్స్ గురించే విష్ణు ట్వీట్ చేసి ఉండొచ్చని.. మరి కొందరు అంటున్నారు. అయితే విష్ణు ఇలా ట్వీట్ చేయడంతో ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది.
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…