Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత గురువారం తన 35వ బర్త్ డేను జరుపుకున్న విషయం తెలిసిందే. ఆమె బర్త్ డే రోజు సమంత నటించిన కాతు వాకుల రెండు కాదల్ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఆచార్యకి పోటీగా బరిలో దిగింది. సమంత క్రేజ్తో ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లు రాబడుతుందని మేకర్స్ భావించారు. కానీ నిరాశే ఎదురైంది. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు జీరో ఓపెనింగ్స్ రాబట్టింది. సమంత పేరు లేదా ఆమె ఫేస్ వాల్యూ సినిమా ఓపెనింగ్స్ పెంచవని దీంతో అర్ధమైంది.
హైదరాబాద్లోని దాదాపు 80 శాతం మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు. ఆంధ్రప్రదేశ్లో చాలా సింగిల్ స్క్రీన్లలో ఎవరూ రాకపోవడంతో ప్రదర్శనలను రద్దు చేశారు. తమిళనాడులో సైతం ఈ చిత్రం పెద్దగా ప్రశంసలు పొందలేకపోయింది. సమంత బర్త్ డే రోజు తన అభిమానులకి ఈ సినిమాతో వరస్ట్ ట్రీట్ ఇచ్చిందని అంటున్నారు. ముగ్గురు సౌతిండియన్ సూపర్ స్టార్స్ విజయ్ సేతుపతి, నయనతార, సమంతలు కలిసి నటించినా కూడా ఫలితం నెగెటివ్గా రావడం ఆశ్చర్యపరిచింది.
కాతువాకుల రెండు కాదల్ సినిమాని విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేయగా.. తెలుగులో ఈ చిత్రం కణ్మణి రాంబో ఖతీజా అనే టైటిల్తో విడుదలైంది. కణ్మని పాత్రలో నయనతార, రాంబోగా విజయ్ సేతుపతి, ఖతీజా కారెక్టర్లో సమంత నటించారు. ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి ప్రేమించడం, ఇద్దరితో కలిసి ఉండాలనుకునే హీరో స్టోరీనే ఈ సినిమా. ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఉండటం వల్ల వచ్చే కష్టాలను విగ్నేశ్ శివన్ చూపించాడు. అయితే విడాకుల తరువాత విడుదలైన సమంత తొలి సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు ఉంటాయని ఆశించారు. కానీ సమంత పేరు సినిమాకు ప్రేక్షకులను రప్పించలేకపోయిందని స్పష్టమైంది. మరి త్వరలో విడుదల కానున్న ఆమె మిగిలిన సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…