Indigestion : జీర్ణ సమస్యలు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. చాలా మంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదని చెబుతుంటారు. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల జీర్ణశక్తిని పెంచుకోవచ్చు. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే..
1. తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసేందుకు బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది. కొన్ని సార్లు జీర్ణాశయంలో యాసిడ్లు అధికంగా ఉత్పత్తి అవడం వల్ల కూడా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవదు. అలాంటి సమయంలో ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి తాగాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
2. భోజనం చేసిన అనంతరం ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి తాగాలి. రాత్రి పూట ఇలా చేయాలి. జీర్ణశక్తి పెరుగుతుంది.
3. భోజనం చేయడానికి ముందు ఒక టీస్పూన్ అల్లం రసం సేవించాలి. రోజుకు 3 పూటలా ఇలా చేయాలి. దీంతో 3 రోజుల్లో జీర్ణశక్తి మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
4. భోజనం అనంతరం సోంపు గింజలను నోట్లో వేసుకుని నములుతుండాలి. దీని వల్ల కూడా ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ కూడా ఉండవు.
5. నాలుగు, ఐదు పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఒక కప్పు మోతాదులో రోజుకు రెండు సార్లు తాగాలి. ఇలా పుదీనా హెర్బల్ టీని తాగుతుంటే జీర్ణ శక్తి పెరుగుతుంది.
6. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక కప్పు మోతాదులో వాము నీళ్లను తాగుతుంటే జీర్ణ సమస్యలన్నీ తగ్గుతాయి. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ వాము గింజలను వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం వచ్చే నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా పరగడుపునే రోజూ తాగుతుంటే అన్ని రకాల జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.
7. వాము నీళ్లలాగే ధనియాలు లేదా జీలకర్ర నీళ్లు కూడా పనిచేస్తాయి. పరగడుపునే ఈ నీళ్లను కూడా తాగవచ్చు. జీర్ణ శక్తి పెరుగుతుంది.
8. రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ జ్యూస్ను సేవించాలి. ఇలా రోజూ తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…