Dream : నిద్రపోతున్నప్పుడు కలలు రావడం చాలా సహజం. అనేక కలలు వస్తూ ఉంటాయి. ఏ కల వచ్చిందని ఒక్కోసారి గుర్తుంటుంది. కానీ ఒక్కొక్కసారి మనకి ఏ కల వచ్చింది అనేది కూడా మనం మర్చిపోతూ ఉంటాము. కొన్ని కొన్ని సార్లు అయితే పీడ కలలు కూడా వస్తూ ఉంటాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, కలలు మూడు రకాలు ఉంటాయి. ఒకటి జరిగిపోయినవి, ఇంకొకటి జరుగుతున్నవి, మూడవది జరగబోయేవి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలు ఎప్పుడూ భవిష్యత్తును సూచిస్తాయని చెప్తారు. అన్ని కలలు మనకి సహజంగా గుర్తు ఉండవు. కొన్ని మాత్రమే గుర్తుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే మరణం వచ్చేముందు మనకి కొన్ని కలలు వస్తాయి.
అదేవిధంగా కొన్ని సంకేతాలు, సూచనలు కూడా కనపడతాయి. శివపురాణం ప్రకారం ఇలాంటివి వస్తే, మరణం తథ్యం. పార్వతి దేవి ఒకరోజు తన భర్త పరమేశ్వరుని ఈ విధంగా అడుగుతుంది. స్వామి మరణానికి సంకేతం ఏమిటి..?, మరణం రాబోతుందని ఎలా తెలుస్తుంది అని.. అప్పుడు శివుడు ఈ విధంగా చెప్తారు.. ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు రంగులోకి మారినా, కొద్దిగా ఎరుపు రంగులోకి మారినా.. ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో చనిపోవచ్చని అర్థం. నీళ్లు, నూనె, అద్దంలో వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు, ఆరు నెలల్లో ఆ వ్యక్తి చనిపోతాడని దానికి అర్థం.
ఒకవేళ కనిపించినా ఆ నీడకి తలభాగం ఉండదు. అలానే ప్రతి వస్తువు కూడా నల్లగానే కనబడుతుంటే, ఆ వ్యక్తి త్వరలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారని దానికి సంకేతం. ఒక వారం పాటు ఎడమ చేయి మెలి తిరిగిపోయినట్లు అనిపిస్తుంటే, మరణం తథ్యం అని దానికి సంకేతం. వ్యక్తి చనిపోయే ముందు నోరు, నాలుక, చెవులు, కళ్ళు ముక్కు రాయిలా గట్టిగా అయిపోతాయట.
ఇలా కనుక అనిపిస్తే కచ్చితంగా ఆ వ్యక్తి ఆరు నెలల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతారు. గుడ్లగూబ గురించి కలలు వస్తే అది మరణ సంకేతం. పావురం, గద్ద, కాకి తలపై కూర్చున్నట్లు కలలో కనపడితే కూడా అది మరణ సంకేతం. చనిపోయే ముందు రోజు పార్వతీ పరమేశ్వరులు కలలో పరామర్శిస్తారట. తీతువు పిట్ట ఇంటి మీద నుండి వెళ్లినా కూడా అది మరణానికి సంకేతమే. ఇటువంటివి చోటు చేసుకుంటే మరణం సమీపంలో ఉందని శివ పురాణం ద్వారా చెప్పబడింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…